పార్లమెంట్‌ ఎన్నికలకు అవే ఈవీఎంలట..! మరి ఫలితాలు..?

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను.. రిపీట్ చేస్తామని… తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో లభించిన విజయంతో వారి కాన్ఫిడెన్స్ ఆ స్థాయిలో ఉంది. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే… టీఆర్ఎస్ కొంత వెనుకబడింది. ఈ సారి ఆ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే… కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. ఇప్పటికీ.. ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంల వల్లే తమకు ఆ ఫలితాలొచ్చాయంటున్నారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో కానీ… ఈసీ మాత్రం ఓ షాక్ లాంటి వార్త చెప్పుకొచ్చింది. అదేమిటంటే… పార్లమెంట్ ఎన్నికల్లోనూ.. ఈవీఎంలే వాడతారట…! ఎక్కడైనా ఈవీఎంలే వాడతారు.. కానీ పార్లమెంట్‌లో వాడేది… అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలట..!

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రజత్‌కుమార్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సమర్థంగా పని చేయాలనుకుంటున్నారు. అందుకే… ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు వాడిన ఈవీఎంలనే పార్లమెంట్‌ ఎన్నికలకు వాడబోతున్నట్లు ప్రకటించారు. రజత్ కుమార్ ప్రకటన… కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే..ఇప్పటికే ఈవీఎంల విషయంలో… విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు.

గ్రేటర్ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలే… అసెంబ్లీ ఎన్నికల్లో వాడారాని…కాంగ్రెస్ నేతలు సెటైరికల్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలే పార్లమెంట్ ఎన్నికల్లో వాడబోతున్నారని… ఈసీ అధికారికంగా ప్రకటించడంతో వారు సైలెంట్‌గా ఉండే అవకాశం లేదు. దీన్నో ఇష్యూ చేయడం ఖాయమే. అయితే.. రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఈసీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి… ఊరికే.. ఓ వివాదం అవడానికి తప్ప… మరో ఉపయోగం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close