హిందూత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వీహెచ్‌పీ ఫిర్యాదుతో కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..!

“హిందూ గాళ్లా.. బొందూగాళ్లా..” అంటూ కరీంనగర్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన వ్యాక్యలపై.. ఈసీ నోటీసు జారీ చేసింది. పన్నెండో తేదీ సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. వీహెచ్‌పీ.. తెలంగాణ అధ్యక్షుడు రామరాజు.. ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు తీరిగ్గా ఈసీ.. పోలింగ్‌కు ముందు ఒక్క రోజు.. నోటీసులు జారీ చేిసంది. నిజానికి కేసీఆర్ ఈ మాటలను అన్న తర్వాత.. దాన్ని బీజేపీ విపరీతంగా మార్కెట్ చేసుకుంది. సోషల్ మీడియాలో హైలెట్ చేసుకుంది. కావాల్సినంత హిందూ సెంటిమెంట్ రగిలించుకునేందుకు తాపత్రయపడింది. కేసీఆర్ కూడా అదే కోరుకున్నట్లు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన బహిరంగసభలో.. బీజేపీ వాళ్లు తనను సోషల్ మీడియాలో తిడుతున్నారని.. చెప్పుకున్నారు.

ఆ తర్వాత… ఆ వివాదం అలా సోషల్ మీడియాలో ఉండగానే.. ఈసీ దాన్ని మరోసారి గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేసింది. నిజానికి ఈ హిందూ జాతీయ వాదాన్ని ఉత్తరాదిలో బీజేపీ విస్తృతంగా వాడుకుంటోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోజూ.. ఏదో కోణంలో ఇలా వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉంటారు. దీనికి ప్రధానమంత్రి కూడా మినహాయింపు కాదు. మైనార్టీల పేరుతో.. అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఈసీ మాత్రం.. లైట్ తీసుకుంటోంది. విద్వేష వ్యాఖ్యలు చేసి.. రాజకీయాన్ని మరింతగా… దిగజార్చుతున్నా.. ఈసీ.. వేగంగా స్పందించడం లేదు.

నోటీసులు జారీ చేసినా.. అది కూడా.. ఓ ప్రత్యేక ఎజెండాతో సమయం చూసుకుని జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో “హిందూ” … ఎన్నికల ఎజెండాను తెచ్చే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రకటనలు వస్తున్న విషయంలో ఎవరికీ డౌట్ లేదు. కానీ.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన ఈసీ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close