ఆ పదిలో కాపులకు 5 శాతం కోటా..!

ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. అగ్రవర్ణాలలో కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే కేంద్రానికి పంపిన బిల్లును వెనక్కి తీసుకుని..ఆ పది శాతం కోటాలో ఐదు శాతం.. కాపులకు ఇస్తే ఎలా ఉంటుందనే అంశపై ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం చేసింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతే చట్ట పరిధిలోకి వస్తుంది. ఆ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన తరువాతనే రాష్ట్రంలో ఆ బిల్లు చట్టరూపంలోకి వస్తుంది.

ఏపిలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కాపులకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏపి అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిని బిల్లు రూపంలోకి తీసుకువచ్చి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. కాపు రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కూడా ప్రభుత్వం కేంద్రానికి పంపిన బిల్లులో కోరింది. అయితే కేంద్రం కాపు రిజర్వేషన్ బిల్లును పక్కన పెట్టి, ఆర్ధికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ ను కల్పించే బిల్లును ఆమోదించింది. ఆర్ధికంగా వెనుక బడిన అగ్రవర్ణ పేదలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్ ను కేటగిరైజేషన్ చేసే అంశంపై న్యాయనిపుణులతో చర్చించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలో కాపు రిజర్వేషన్ ను నాలుగు లేదా ఐదు శాతాన్ని ఇందులో పొందుపరచాలనే అంశాన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.

అగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చే పది శాతం రిజర్వేషన్లను ఆయా వర్గాలకు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా, ఆయా ‘ సెక్షన్స్ ‘ కి ఇవ్వవచ్చునని బిల్లులో ఉంది. అంటే సెక్షన్ లు అని బిల్లులో పేర్కొనడం వలన ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించవచ్చునని బిల్లు ఉద్దేశమని, జస్టిస్ మంజునాధ కమిషన్ ఇచ్చిన నివేదిక అదే సూచిస్తుందని, సియం వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిపుణులు సూచించారు. ఇలా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించాలంటే ముందు కేంద్రానికి ఏపి ప్రభుత్వం పంపిన బిల్లును వెనక్కి తీసుకోవాలని కూడా న్యాయనిపుణులు సూచించారు. ఎలాగైనా కాపుకోటాను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close