హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తులు జప్తు!

మనీ లాండరింగ్ మరియు అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ కి చెందిన సుమారు 8 కోట్లు విలువయిన ఆస్తులను ఈడి అధికారులు నిన్న తాత్కాలికంగా జప్తు చేసారు. ఇదివరకు ఆయన కుమార్తె పెళ్లి జరుగుతున్న సమయంలో సిబీఐ ఆయన కేసు నమోదు చేసింది. ఇప్పుడు హోలీ పండుగ రోజున ఈడి తన ఆస్తులను జప్తు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని వీర్ భద్ర సింగ్ ఆరోపించారు. డిల్లీలోని గ్రేటర్ కైలాష్ అనే పోష ఏరియాలో ఆయన భార్య పేరిట ఉన్న ఒక ఫ్లాట్ ని నిన్న ఈడి అధికారులు జప్తు చేసారు. దాని విలువ కనీసం రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం. అదికాక వారి పేరిట ఉన్న రూ. 2.5 కోట్లు విలువున్న బాండ్లు వగైరాలను కూడా ఈడి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, కానీ తను అటువంటి వాటికి భయపడేది లేదని వీర్ భద్ర సింగ్ చెప్పారు.
ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడానికి ఒక పారిశ్రామిక వేత్త నుంచి భారీగా లంచాలు పుచ్చుకొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ పారిశ్రామికవేత్త స్వయంగా ఆవిషయం మీడియాకి తెలియజేయడం సంచలనం సృష్టించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, సిబీఐ, ఈడీ సంస్థల నుంచి నోటీసులు అందుకొంటున్న కారణంగా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కేసులను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకొన్నా బాగుండేది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా ఆయనని ఆ పదవి నుంచి తప్పించినా బాగుండేది. అలాగా చేయకుండా మోడీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకి పాల్పడుతోందని చెప్పుకోవడం, ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన వంటి రాజకీయనేతలు రోటీన్ గా పాడే పాటేనని భావించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close