సాక్షిలో “మనీలాండరింగ్‌ మనీ” పైనే మొదట ఈడీ కోర్టు విచారణ !

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న పలు అక్రమాస్తుల కేసుల్లో ఈడీ కేసుల విచారణ చురుగ్గా సాగడానికి మార్గం సుగమం అయింది. మొదటిగా ఆయన మీడియా సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు పూర్తయినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కోర్టుక తెలిపింది.ఈడీ కేసుల విచారణ జరగకుండా నిందితులు రకరకాల పిటిషన్లు వేస్తూండటంతో జగతి పబ్లికేషన్స్‌, పెన్నా, ఇండియా సిమెంట్స్‌ ఈడీ కేసులపై దర్యాప్తు స్టేటస్ చెప్పాలని ఈడీని కోర్టు ఆదేశించింది. వీటిలో జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు పూర్తయిందని ఈడీ తెలిపింది.

జగతి పబ్లికేషన్స్ సాక్షి పత్రిక ఓనల్. అలాగే ఆ గ్రూపులోని ఇతర మీడియా సంస్థలకు కూడా పెట్టుబడిదారు. దర్యాప్తు పూర్తయినట్లుగా ఈడీ తేల్చడంతో అభియోగాల నమోదు, డిశ్ఛార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించాలని జగన్‌, విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. వాదనలు వినిపించేందుకు ఇదే ఆఖరి అవకాశం అని కోర్టు స్పష్టం చేసింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు అక్రమ మార్గాల ద్వారా మనీ లాండరింగ్ ద్వారా చట్టాలను ఉల్లంఘించి తీసుకు వచ్చారని ఈడీ ఆరోపిస్తోంది.

సీబీఐ కేసులు అవినీతి చేశారని నమోదు చేశారు. ఈడీ కేసులు అక్రమ నగదు చెలామణి కోణంలో నమోదు చేశారు. ఈ క్రమంలో పెట్టుబడుల నగదు ఎలా వచ్చిందో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈడీ కేసుల విచారణ ముందు వద్దని అదే పనిగా కోర్టులకు విజయసాయిరెడ్డి వంటి వారు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎలాంటి పిటిషన్లు వేసి విచారణ జరిపినా తొలిగా జగతి పబ్లికేషన్స్‌ కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలా ప్రారంభమైతే ఆ కేసులోనే మొదట తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈడీ కేసులు త్వరగా తేలిపోతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close