దేశవ్యాప్తంగా ఎన్నార్సీ..! పౌరసత్వం నిరూపించుకోవాల్సిందే..!

దేశంలో ఉండాలంటే.. హిందీ నేర్చుకోవాల్సిందేనన్నట్లుగా మాట్లాడి కలకలం రేపిన కేంద్రహోంమంత్రి అమిత్ షా… దక్షిణాదిలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో కాస్త వెనక్కి తగ్గారు. మాతృభాష తర్వాతే హిందీ అన్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా… దేశం మొత్తం ఎన్నార్సీ రూపొందిస్తామని చెబుతున్నారు. అంటే.. దేశంలో ఉంటున్న వాళ్లు భారతీయులే అని నిరూపించుకోవాలంటే.. ఆ జాబితాలో పేరుండాలి. ఆ జాబితాను బీజేపీ సర్కార్ రూపొందిస్తుంది. నేషనల్ రిజిస్ట్రి ఆఫ్ సిటిజన్ షిప్ ని ఇప్పటికే అసోంలో అమలు చేశారు. ఓ ఇరవై లక్షల మందిని భారతీయులు కాదని… ప్రత్యేకంగా రెప్యూజీ క్యాంపుల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మోదీ, షా సర్కార్లు దేశం మొత్తం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో పొరుగు దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని.. వారి కోసం.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ షిప్ అనే… పద్దతిని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఈ రిజిస్టర్‌లో ఉన్న వారు మత్రమే భారతీయులు. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు వారి కన్నా… బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్న భావనతో దీన్ని తీసుకు వచ్చారు. అక్కడి ప్రజల్లోనూ.. తాము మైనార్టీలం అయిపోతున్నామన్న భావన ఉండటంతో.. ఓ రకంగా అంగీకారం లభించింది. అయితే… బీజేపీ.. తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడింది. హిందువులు ఇతర దేశాల నుంచి దేశంలోకి వచ్చి ఉంటే.. వారికి పౌరసత్వం ఇచ్చారు. ముస్లింలు చాలా మంది ఇండియన్స్ అయినప్పటికీ వారు శరణార్థుల జాబితాలో ఉండిపోయారు.

ఈ ఎన్నార్సీని ఇప్పుడు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తామని.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్నార్సీ రిజిస్టర్ లో చేరుస్తామని… దేశం కాని వాళ్లను బయటకు పంపుతామని చెబుతున్నారు. హిందువులు తమకు ఓట్లు వేస్తారు కాబట్టి.. పక్క దేశాల నుంచి వచ్చి తిష్టవేసినా.. వారికి పౌరసత్వం ఇస్తారు. అదే.. దేశంలో నిఖార్సైన భారతీయులు మాత్రం… అమిత్ షా నుంచి తాము భారతీయులమనే సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close