ఈవీఎంలతో ఫలితాలు మార్చేశారు..! లండన్ నుంచి ఆధారాలు..!

2014 నుంచి గత ఏడాది వరకూ భారత్ లో జరిగిన అన్ని ఎన్నికలు ట్యాంపర్ అయ్యాయని.. ఆ ట్యాంపరింగ్ చేసింది తన టీమేనని.. సయ్యద్ సుజా అనే వ్యక్తి లండన్ వేదికగా బయటపెట్టి కలకలం రేపారు. లండన్ లో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ఫేస్ కనబడకుండా మీడియా ముందుకు వచ్చిన సయ్యద్ ఈవీఎంలు రూపొందించిన ఈసీఐఎల్ నిపుణుల బృందంలో కీలక వ్యక్తిగా చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సయ్యద్ మరో నలుగురితో కలిసి .. ఈవీఎంల ట్యాంపరింగ్ కకు పాల్పడ్డానని చెబుతున్నారు. మిగతా నలుగుర్ని.. భారతీయ జనతా పార్టీ నేతలు చంపించారని.. తనను కూడా చంపుతారన్న భయంతోనే.. విదేశాలకు పారిపోయానని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన .. ప్రాణభయంతో.. అమెరికా ఆశ్రయాన్ని కోరారు.

సయ్యద్ సుజా.. 2014 నుంచి ఏం జరిగిందో స్పష్టంగా వివరించారు. ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ప్రత్యేకంగా డెమో కూడా ఇచ్చారు. బ్లూంబెర్గ్ క్వింట్ న్యూస్ ఎజెన్సీ..మొత్తం లైవ్ టెలికాస్ట్ చేసింది. ట్యాంపరింగ్ గురించి పూర్తి వివరాలు తెలిసిన వారిని ఒక్కొక్కరూ హత్యకు గురవుతున్నారని సయ్యద్ చెప్పుకొచ్చారు. బిజెపి నేత గోపీనాధ్ ముండేతో పాటు అప్పట్లో ఎన్నికల ప్రధానాధికారి సంపత్ ఆధ్వర్యంలోనే ట్యాంపరింగ్ ప్రాసెస్ జరిగినట్లు స్పష్టంగా ప్రకటించారు. ఈ విషయం మొత్తం తెలుసు కాబట్టి.. బయటకు వస్తుందన్న భయంతోనే గోపీనాథ్ ముందేను హత్య చేశారని చెప్పారు. ఎన్నికలు జరిగి.. బీజేపీ అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే.. ముండే.. ఢిల్లీలో అనుమానాస్పదంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్న తన ముఠాలో… అజాస్, వంశీ, కేశవ్, ప్రకాశ్, హంజాస్ తదితరులు ఉన్నారని చెప్పారు. అయితే వీరందరూ ఆ తర్వాత హత్యకు గురయ్యారని సయ్యద్. అలాగే.. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కు ఈ వ్యవహారం మొత్తం తెలుసని.. దీన్ని ఆమె బయట పెట్టాలనుకున్నారని.. కానీ ఈ లోపే హత్యకు గురయ్యారని చెబుతున్నారు. తనను కూడా చంపాలని బిజెపి పెద్దలు ప్రయత్నించారని సయ్యద్ ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి యూపీ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ట్యాంపరింగ్ చేశామని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ట్యాంపరింగ్ కు అవకాశం కుదరలేదన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ట్యాంపరింగ్ కు తాను సహకరించలేదన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో బిజెపికి లాభం కలిగేలా రిలయన్స్, జియో అన్ని ఏర్పాట్లు చేశాయని సయ్యద్ చెబుతున్నారు. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో రియలన్స్ కంపెనీ సహకారంతో జియో నెట్ వర్క్ సహాయంతో ట్రాన్స్ మిట్ చేసి ట్యాంపరింగ్ చేశారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 201 సీట్లను ట్యాంపరింగ్ వల్ల కోల్పోయిందంటున్నారు. సయ్యద్ సుజా ఆధారాలు మొత్తం తాను మీడియాకు ఇస్తానని చెబుతున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశంలో చాలా కాలంగా అనుమానాలున్నాయి. ఇటీవల కోల్ కతాలో సమావేశమైన విపక్ష పార్టీలు కూడా.. ఈవీఎంల మీదే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు నెలల్లో భారత్ లో సార్వత్రిక ఎన్నికలు..జరగనున్నాయి. దాదాపుగా 90 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ ట్యాంపరింగ్ విషయం బయటకు రావడం.. దేశంలో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ క్రియేటివిటి అని ఆరోపిస్తోంది. కానీ ఈ అంశం అంత తేలిగ్గా ఆగిపోయే అవకాశం కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close