ఎక్స్‌క్లూజీవ్‌: చిరుకి క‌థ చెప్పిన గోపీచంద్‌

ఈ సంక్రాంతికి త‌న ఖాతాలో మ‌రో హిట్ వేసుకొన్నాడు గోపీచంద్ మ‌లినేని. బాల‌కృష్ణ‌ని `వీర సింహారెడ్డి`గా చూపించి.. అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకొన్నాడు. అంత‌కు ముందు తీసిన `క్రాక్‌` సైతం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని అందుకొంది. దాంతో.. గోపీచంద్ మ‌లినేనిపై అగ్ర హీరోల దృష్టి ప‌డింది. గోపీ మాత్రం ఇప్పుడు మెగాస్టార్ వైపు చూస్తున్నాడు. తాజాగా.. చిరంజీవిని క‌లిసి.. ఓ క‌థ చెప్పిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. అది.. చిరుకి సైతం బాగా న‌చ్చింద‌ట‌. దీనిపై చిరంజీవి ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సివుంది. చిరు ప్ర‌స్తుతం `భోళా శంక‌ర్‌`తో బిజీగా ఉన్నాడు. ఆ త‌రవాత వెంకీ కుడుముల‌తో ఓ ప్రాజెక్టు చేయాలి. ఆ సినిమా ఉందా? లేదా? అనేది ప్ర‌స్తుతానికి డౌటుగా ఉంది. ఈ సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్ డేటూ లేదు. ఒక వేళ వెంకీ కుడుముల సినిమా లేక‌పోతే.. గోపీచంద్ సినిమా మొద‌లైపోతుంది. వెంకీ కుడుముల కూడా లైన్‌లో ఉంటే.. ఈ రెండు సినిమాల్నీ ఒకేసారి ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది. వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ రెండు చిత్రాల‌కూ చిరంజీవి స‌మాంత‌రంగానే డేట్లు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే పంథా.. 2023లోనూ కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close