హరీష్‌ మెడపై కమిటీ కత్తి

తెలంగాణ రాజకీయాలలో టిఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నట్టు రోజురోజుకు మరింతగా అర్థమవుతుంది. కాని అందుకు సంతోషిస్తూనే పూర్తిగా ఆనందం పంచుకోలేకపోతున్న ముఖ్యనాయకులొకరున్నారు. ఒకప్పుడు కెసిఆర్‌ తర్వాత అంతటి నేతగా పేరు తెచ్చుకున్న హరీష్‌ రావు ఇప్పుడు ఆచితూచి అతి జాగ్రత్తగా అడుగులు వేయవలసిన పరిస్థితి. వారసత్వ ప్రక్రియలో కుమారుడినే కెసిఆర్‌ పూర్తి స్థాయిలో ప్రతిష్టించిన తర్వాత ఆ ప్రభావం అనేక రూపాల్లో ప్రత్యక్షమవుతున్నది.

కీలకమైన ప్రకటలు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. ముఖ్యమైన బాధ్యతలను అప్పగించి ముందు నిలపడం తగ్గుతున్నది. వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో రెబల్స్‌ అంతమంది పోటీకి నిలవడం కూడా ఆయనను ఇబ్బంది పెట్టింది. చివరకు ఆయన వల్లనే గట్టెక్కామని కెసిఆర్‌ కూడా అంగీకరించవలసి వచ్చింది. నారాయణఖేడ్‌లో కూడా బుల్లెట్‌లా దూసుకుపోతాడని కితాబిచ్చి వచ్చారు. గతం కన్నా తగ్గినా అప్పుడప్పుడూ మాటల్లో కాస్త అభినందిస్తున్న ముఖ్యమంత్రి చేతల్లో మాత్రం హరీష్‌ ప్రాధాన్యత తగ్గిందని సంకేతాలు ఇస్తున్నారు. బడ్జెట్‌లో నీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించారు. కాని వాటి నిర్వహణ బాధ్యత సంబంధిత శాఖ చూస్తున్న హరీష్‌కు వదలిపెట్టలేదు. తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్‌లతో పాటు ఒక కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రాజెక్టుల ఘనత పూర్తిగా హరీష్‌కు దక్కకుండా చేసేందుకు, నిధుల వినియోగంలోనూ ఆయనకు మాత్రమే అధికారం వుండే పరిస్థితి లేకుండా అడ్డుకోవడానికి ఈ కమిటీ వేశారని హరీష్‌ అనుయాయులు భావిస్తున్నారు. తుమ్మలను తీసుకురావడంలోనూ అడుగడుగునా ఆయనను ముందుకు తేవడంలోనూ కెసిఆర్‌ మొదటినుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఈ శిబిరం అభిప్రాయంగా వుంది. కాని ఎంత చేసినా కెటిఆర్‌ అందరినీ ఆకట్టుకోలేకపోతున్నారని వీరంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close