ఆ బిల్లులు రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే పాస్..!

వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వ చిక్కులలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఊహించుకున్నాయి కానీ… బీజేపీ పెద్దలు అంత కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓటింగ్ అవసరం లేకుండా.. మూజువాణి ఓటుతో ఆమోదించేసినట్లుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో ప్రకటించేసుకున్నారు. దీంతో ఈ బిల్లును చట్ట రూపంలోకి తేకూడదని పట్టదల ప్రదర్శించిన విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు వెళ్లిన కొంత మంది సభ్యులు.. ఆ బిల్లులను చించేసి గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తానుకున్నది చేసేసింది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్యానికే దుర్దినం అన్న విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. గత వారమే ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థిగా ఆర్జేడీ నేత ఉన్నప్పటికీ.. అత్యధిక పార్టీలు మద్దతు తెలుపడంతో మూజువాణి ఓటుతోనే ఆయన డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన వారంలోనే అప్రజాస్వామికంగా.. ఓటింగ్ లేకుండా బిల్లులను పాస్ చేయించేసి.. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. నిజానికి రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మెజార్టీ లేదు. బీజేపీ మిత్రపక్షాలు.., ప్రతీ అంశంపై మద్దతు పలుకుతూ వస్తున్న బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా.. ఆలోచనలో పడ్డాయి. ఇలాంటి సమయంలో ఓటింగ్‌కు వెళ్లడం సురక్షితం కాదని.. బీజేపీ .. మూజు వాణి ఓటు వైపు మొగ్గు చూపింది.

ఇది అప్రజాస్వామ్యమైన ప్రక్రియ అని విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించి.. రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. బిల్లుల ఆమోదం ప్రక్రియను డిప్యూటీ చైర్మన్ చేతుల మీదుగా నడిపించడానికి అంగీకరించారు. మామూలుగా చైర్మన్‌గా వెంకయ్యనాయుడు పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత బిల్లుల ఆమోదం ఆయన చేతుల మీదుగానే నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం.. వివాదాస్పద ఆమోదానికి డిప్యూటీ చైర్మన్ ను పంపారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గినా.. ఓడినా పెద్ద తేడా ఉండదు.. వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close