మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భారీ అగ్నిప్రమాదం

నిన్న రాత్రి ముంబైలో గిర్ గావ్-చౌపాతీ బీచ్ వద్ద మేక్ ఇన్ ఇండియా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నపుడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక క్రింద మంటలు చెలరేగడంతో క్షణాలలో వేదిక పూర్తిగా దగ్ధమయిపోయింది. దానికి కొన్ని నిమిషాల ముందే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అదే వేదికపై చిన్న కవితను వినిపించారు. ఆ తరువాత 8.22 నిమిషాలకు బాలీవుడ్ నటి పూజా సావంత్ బృందం లావణి నృత్య కార్యక్రమం చేస్తుండగా వేదిక క్రింద మంటలు అంటుకొన్నాయి. అది గమనించిన సభ నిర్వాహకులు వారిని తక్షణమే వేదిక మీద నుండి క్రిందకు దింపివేశారు. వారు వేదిక దిగిన కొన్ని క్షణాలలోనే మంటలలో వేదిక మొత్తం తగులబడిపోయింది.

దగ్గరలోనే ఉన్న అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియదు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక క్రింద అమర్చిన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చౌపాతీ బీచ్ ఒడ్డున నిర్వహిస్తుండటంతో అక్కడ వీస్తున్న బలమయిన గాలికి మంటలు చాలా వేగంగా వేదికపైకి వ్యాపించాయి.

ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రులు, శివసేన అధినేత ఉద్దవ్ టాక్రే, అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, 60 దేశాల నుండి ప్రతినిధులు, సుమారు 10,000కి పైగా ప్రజలు వచ్చేరు. మంటలు అంటుకోగానే అప్రమత్తమయిన పోలీసులు లోపల ఉన్నవారిని అందరినీ జాగ్రత్తగా బయటకి తరలించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వారిని బయటకు తరలించడంలో సహాయపడ్డారు. ఆ సభా వేదికకి ఐదు ద్వారాలు ఏర్పాటు చేసి ఉండటంతో అందరినీ వేగంగా బయటకి తరలించడం సాధ్యమయింది. ఇంత భారీ అగ్నిప్రమాదంలో ఏ ఒక్కరు కూడా గాయపడకుండా తప్పించుకోగలిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close