400 కోట్ల కోసమే అమరావతి ఎంపిక

తము కొన్న భూమిపై కోట్లలో లాభాలు సంపాదించడం కోసమే ఒక రాష్ట్ర మంత్రి, మరో కేంద్ర మంత్రి పట్టుపట్టి రాజధానిని అమరావతికి తరలించారని తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. రాజధాని డిజైన్ల పేరిట హడావుడి జరుగుతున్నప్పుడు ఆయన ఈ మాటలనడం విశేషం. విజయవాడ చుట్టుపక్కల వందల ఎకరాల భూమి అందుబాటులో వుందేది. ఇప్పటికే ప్రసిద్ధికెక్కిన పట్టణాలను నగరాలను ఆధారం చేసుకుని రాజధానిని కట్టుకుని వుంటే ఎప్పుడో పూర్తయ్యేది. కాని అమరావతి అంటూ బయిలు దేరారు. అక్కడ ఎ టు జెడ్‌ సమకూర్చుకోవలసిందే కదా.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మాకే కాదు ముఖ్యమంత్రికీ తెలియదు. చెరో రెండు వందల ఎకరాలు ముందుగానే తీసుకున్న ఆ కేంద్ర మంత్రి, ఆ రాష్ట్ర మంత్రి మాత్రమే దీనివల్ల లాభపడాలనుకున్నారు. ఎకరాకు కోటి లాభం వస్తుందనుకుందాం. దానికోసం ఇంత కక్కుర్తి పడాలా అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. నిజంగా అక్కడ అభివృద్ధి జరిగి అందరూ సంతోషించాలంటే ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదని ఏదో విధంగా మురిపించడం కోసం ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రికి దగ్గరగా మెలిగే ఆ నేత వాపోయారు. నారాయణకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఇస్తున్నారో ఒక్కరికైనా అర్థం కాదని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు చెప్పిన మాటలు నమ్మిన చంద్రబాబు కూడా అనేక విధాల ప్రయోజనం కలుగుతుందనే ఆశతో భూ సమీకరణ వంటివన్నీ పూర్తిచేసి అమరావతిలోచిక్కుకుపోయారని, ఎన్నికలలోగా ఏదో జరిగినట్టు చూపించడం ఏమంత తేలిక కాదని స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close