తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స..!

వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. టెస్టులు కూడా.. ఉచితంగా చేయాలని ప్రైవేటు ఆస్పత్రులకు దిశానిర్దేశంమ చేస్తోంది. ముందుగా మూడు భారీ ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ఆస్పత్రులను.. ఈ దిశగా.. ఉచిత చికిత్స ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌, మమతా మెడికల్ కాలేజ్‌, కామినేని మెడికల్ కాలేజీల్లో మొదట కరోనా టెస్ట్‌లు, కరోనా చికిత్సలు ఉచితంగా అందించనున్నారు.

ముందు ముందు భారీ ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులతోపాటు.. కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా.. ఈ ఉచిత కరోనా టెస్టులు, చికిత్స విధానాన్ని విస్తరించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ ఉచిత టెస్టులు, చికిత్స విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. తెలంగాణ సర్కార్.. కరోనా విషయంలో… పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తోందని.. హైకోర్టు తీవ్రంగా మండిపడిన తర్వాతి రోజే… ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సరైన కరోనా వైద్యం అందడం లేదంటూ.. హైకోర్టులో అదే పనిగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. టెస్టుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అదే సమయంలో.. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. హోం ఐసోలేషన్ అంటూ.. ఇంటికే పంపించేస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరదామనుకునేవారికి అవకాశం దక్కడం లేదు. ఏ ఆస్పత్రి చేర్చుకోవడం లేదు. బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వీఐపీలు వస్తే క్షణాల్లో వారిని చేర్చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటిపై… తెలంగాణలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కదిలింది. అయితే.. ప్రకటనలకే కాకుండా… సీరియస్‌గా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ.. టెస్టులు, చికిత్స ఉచితంగా అందేలా చూడాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వానికి ఎక్కువగా వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close