రు.251లకే స్మార్ట్ ఫోన్! ఆవిష్కరించనున్న కేంద్రమంత్రి

హైదరాబాద్: ఇది నిజంగా దేశానికే గర్వకారణమైన విషయం. ఒక భారతీయ కంపెనీ కారుచవకగా, రు.251లకే స్మార్ట్ ఫోన్‌ను అందిస్తోంది. ఇంత చవకగా స్మార్ట్ ఫోన్ లభిస్తే భారత్‌లో ‘డిజిటల్ డివైడ్’ అనే అంతరం త్వరలోనే మాయమవుతుందని చెప్పాలి. ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ అనే సంస్థ(http://freedom251.com/) ఈ ఫోన్‌లను తయారు చేస్తోంది. రేపు – 18.02.16 – ఉదయం 6 గంటలనుంచి బుకింగ్‌లను ఓపెన్ చేయనుంది. ఈ ఫోన్‌ను ఇవాళ సాయంత్రం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో లాంఛనంగా విడుదల చేస్తారు. మరి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందో తెలియటానికి కొద్దిరోజులు ఆగాలి. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం రు.5,000 రేటున్న స్మార్ట్ ఫోన్‌లతో సమానంగా ఉండటం విశేషం.

  • ఫ్రీడమ్ 251గా పిలుస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్‌తో నడుస్తుంది.
  • దీనిలో 1.3 గిగా హెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది.
  • 3జీ సిమ్‌లను కూడా వేసుకోవచ్చు.
  • స్క్రీన్ డిస్ ప్లే 4 అంగుళాలు ఉంది.
  • 1 జీబీ ర్యామ్ ఉంది.
  • 8 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది… 32 జీబీ దాకా పెంచుకోవచ్చు.
  • వెనకవైపు 3.2 మెగాపిక్సెల్ కెమేరా, ముందువైపు 0.3 మెగా పిక్సెల్ కెమేరా ఉన్నాయి.
  • 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • 1 సంవత్సరం వారంటీ ఉంది
    • Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close