బ్రసెల్స్ లో మళ్ళీ బాంబు ప్రేలుళ్ళు

బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరానికి ఉత్తరాన గల స్కర్ బీక్ అనే ప్రాంతంలో ఈరోజు మళ్ళీ రెండు ప్రేలుళ్ళు జరిగాయి. మొన్న మంగళవారంనాడు బ్రసెల్స్ విమానాశ్రయంలో, మెట్రో రైల్వే స్టేషన్లో జరిగిన విస్పోటనాలలో 35మందికి పైగా మరణించారు. అప్పటి నుంచి భద్రతా దళాలు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. బ్రసెల్స్ జరుగుతున్న ఈ బాంబు దాడులకు పారిస్ నగరంలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదితో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఫ్రాన్స్ భద్రతా దళాలు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో పారిస్ నగరంలో గురువారం రాత్రి అర్జెంషిల్ అనే ప్రాంతంలో శోదాలు నిర్వహించి రెడ క్రికెట్ అనే 34 ఏళ్ల వయసున్న యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతని ఇంట్లో నుంచి భారీగా మారణాయుధాలు, బాంబులు, మేకులు వగైరా స్వాధీనం చేసుకొన్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకి రిక్రూటర్ గా పనిచేస్తున్న అతను త్వరలో పారిస్ నగరంలో మరో భారీ విద్వంసానికి సిద్దం అవుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అతనిని విచారించినపుడు బ్రసెల్స్ లో జరిగిన బాంబు దాడుల గురించి చాలా వివరాలు తెలిసాయి. అతని ద్వారానే స్కర్ బీక్ అనే ప్రాంతంలో కూడా ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేయబోతున్నట్లు తెలియడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం బెల్జియం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఆ సమాచారంతో ఈరోజు మధ్యాహ్నం భద్రతాదళాలు స్కర్ బీక్ ని చుట్టుముట్టి శోదాలు నిర్వహిస్తుండగా, ఒక ట్రామ్ స్టేషన్ వద్ద వరుసగా రెండు విస్పోటనాలు జరిగాయి. వెంటనే భద్రతా దళాలు అక్కడికి చేరుకొని ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. ఇంకా నగరంలో మరెక్కడయినా ఉగ్రవాదులు దాగి ఉన్నారేమో కనుగొనేందుకు, బెల్జియం దేశ భద్రతాదళాలు బ్రేసిల్స్ నగరాన్ని ఆణువణువూ జల్లెడ పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close