భారత్-పాక్ మధ్యలో అమెరికా!

పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాక్ దేశాల మధ్య గంభీరమయిన వాతావరణం నెలకొని ఉంది. ఆ దాడికి కుట్రపన్నిన వారిని కనిపెట్టేందుకు మరిన్ని ఆధారాలు కావాలని పాక్ ప్రభుత్వం కోరడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకొనేందుకు అది సిద్దంగా లేదనే సంగతి చెప్పకనే చెప్పినట్లయింది. అయినప్పటికీ భారత్ చాలా సంయమనంగా వ్యవహరిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో వరుసగా జరిగిన కొన్ని పరిణామాలు భారత్-పాక్ మధ్య దూరాన్ని మరింత పెంచాయి.

భారత్ పై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ మరియు ఐ.ఎస్.ఐ.అధికారులే అవసరమయిన అన్ని సహాయసహకారాలు అందజేస్తున్నారని డేవిడ్ హెడ్లీ తన వాంగ్మూలంలో విస్పష్టంగా చెప్పాడు. అతని మాటలని పాక్ చాలా తేలికగా కొట్టి పడేసింది కానీ భారత్ మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా పాకిస్తాన్ కి అత్యాధునిక ఎఫ్-16 యుద్ద విమానాలను అమ్మింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే యుద్ద విమానాలు సరఫరా చేస్తున్నామని అమెరికా చెప్పుతోంది. కానీ భారత్ ని దృష్టిలో పెట్టుకొనే వాటిని పాక్ సమకూర్చుకొందనే విషయం బహిరంగ రహస్యమే.

పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు పాక్ ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయసహకారాలు అందజేస్తున్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ఎఫ్-16 యుద్ద విమానాలను సరఫరా చేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించి, అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని పాకిస్తాన్ తప్పు పట్టింది. తమ దేశంతో పోలిస్తే భారత్ వద్ద అత్యాదునికమయిన యుద్ధవిమానాలు చాలా ఉన్నాయని, తాము కొన్నిటిని సమకూర్చుకొంటే దానికి భారత్ అభ్యంతరం చెప్పడం తగదని పాక్ వాదన. బహుశః అందుకే పాకిస్తాన్ ఆర్మీ మరియు ఐ.ఎస్.ఐ. అధికారులు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులకు పంపించారేమోనని అనుమానించవలసి వస్తోంది. అటువంటప్పుడు ఆ కుట్ర పన్నిన వారిని పాక్ పట్టుకొని చర్యలు తీసుకొంటుందని ఆశించడం అవివేకమే అవుతుంది.

పఠాన్ కోట్ దాడి జరిగినప్పటి నుండి పాక్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఈ యుద్ద విమానాల వివాదం తలెత్తడంతో ఇప్పుడు పాక్ ప్రభుత్వం కూడా భారత్ ని వేలెత్తి చూపే అవకాశం దక్కింది. ఈ కారణంగా భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉగ్రవాదులను అప్పగించే విషయంలో పాక్ పై ఒత్తిడి చేయవలసిన అమెరికా దానికి యుద్ధవిమానాలు అందించడం ద్వారా పాకిస్తాన్ కే మద్దతు తెలిపినట్లయింది. కనుక ఇక పాకిస్తాన్ కూడా భారత్ చేసే ఒత్తిళ్లకు లొంగక పోవచ్చును. ఈవిధంగా పాకిస్తాన్, అమెరికాలు తమ ద్వంద వైఖరిని మరొకసారి బయటపెట్టుకొన్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close