తాత్కాలిక సచివాలయానికి మళ్ళీ టెండర్లు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం టెండర్లు వేసిన ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ లిమిటెడ్ చదరపు అడుగుకి రూ.4,000 ధరను చెల్లించాలని సి.ఆర్.డి.ఏ.ని కోరినట్లు తెలుస్తోంది. కానీ సి.ఆర్.డి.ఏ. అధికారులు చదరపు అడుగుకి రూ.3,000 మాత్రమే చెల్లించేందుకు నిర్ణయించుకోవడంతో ఆ రెండు సంస్థలు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. కేవలం ఆరు నెలలలో ఆరు భవనాలను పూర్తిగా నిర్మించి ఇవ్వాలంటే, రేయింబవళ్ళు పనిచేయవలసి ఉంటుందని, రాత్రి పూట నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తే అందుకు అదనంగా మరో 30 శాతం ఖర్చు అవుతుందని కనుక తాము కోరిన ధర చెల్లిస్తేనే ఈ పని చేపట్టగలమని తేల్చిచెప్పినట్లు సమాచారం. కానీ సి.ఆర్.డి.ఏ. అధికారులు అందుకు అంగీకరించలేదు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. మరిన్ని సంస్థలు ఈ పని చేసేందుకు ముందుకు వచ్చేందుకు వీలుగా ఈసారి కొన్ని షరతులు సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఆరు నెలలో పూర్తి చేయాలి లేకుంటే నిర్మాణ వ్యయంలో 10 శాతం జరిమానా విధింపు అనే రెండు షరతులు కారణంగానే నిర్మాణ సంస్థలు అన్నీ వెనకడుగు వేస్తున్నాయి. ఒకవేళ సి.ఆర్.డి.ఏ.ఆ రెండు షరతులు సడలించి, చదరపు అడుగుకి ధర మరి కొంత పెంచే మాటయితే టెండర్లు వేసిన ఆ రెండు సంస్థలే నిర్మాణం చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని సమాచారం.

తాత్కాలిక సచివాలయానికి ఈనెల 12వ తేదీన శంఖుస్థాపన చేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నాక, ఆరు నెలలోనే నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న సి.ఆర్.డి.ఏ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్ల పిలవాలనే ఆలోచన చేయడం చిత్రంగానే ఉంది. దాని వలన పనులు మరొక మూడు నాలుగు వారాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close