మంత్రులు అడిగినట్లుగానే..వెంకయ్య నిధులిప్పించారు..!

ఐదు రోజుల క్రితం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో ధాన్యం రైతులకు డబ్బులు అందకపోవడంపై.. సంబంధింత కేంద్రమంత్రిని, అధికారుల్ని పిలిపించి మాట్లాడారు. ఏపీలో రైతుల కష్టాలు చెప్పి.. వారికి నిధులు అందేలా చూడాలన్నారు. ఇలా వెంకయ్య సమీక్ష చేయడం.. ఏపీ మంత్రులకు నచ్చింది. కేంద్రాన్ని ఎన్ని సార్లు అడిగినా నిధులు ఇవ్వడం లేదు .. వెంకయ్య చెబితే పని అయిపోతుందని అనుకున్నారేమో కానీ.. కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కలిసి వెంకయ్యనాయుడు ఓ లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించాలని కోరారు. ఈ లేఖకు స్పందనగా.. నిధులు విడుదలైన సమాచారం.. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఏపీకి రూ.2,498.89 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసిన ప్రభుత్వం.. దాదాపుగా రూ. రెండు వేల కోట్లను పెండింగ్‌లో పెట్టింది. అయితే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. నాలుగున్నరవేల కోట్లు రావాల్సి ఉందన్న ఏపీ సర్కార్ వాదిస్తోంది. కొడాలి నాని.. ఓ సారి ఢిల్లీ వెళ్లి మంత్రుల్ని కలిసి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. కానీ వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవడంతో.. వెంటనే నిధులు విడుదలయ్యాయి. కేంద్రం.. ఎఫ్‌సీఐకి రూ.2,498.89 కోట్లను విడుదల చేసింది.. వీటిని ఎఫ్‌సీఐ ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేస్తుంది. దీంతో.. ధాన్యం రైతుల సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యే అవకాశం ఉంది.

వెంకయ్యనాయుడు చొరవతో నిధుల విడుదల జరిగింది.కానీ ఇప్పుడు… వైసీపీ నేతలు ఈ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధపడకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లనే కేంద్రం నిధులు విడుదల చేసిదంని చెప్పుకునే అవకాశం ఉంది. క్రెడిట్ ను వెంకయ్యకు ఇవ్వడానికి.. వైసీపీ సిద్దంగా ఉండదు.. ఆయనంటే… వైసీపీ నేతలకు పడదు మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close