రఫెల్‌పై సీబీఐ దర్యాప్తు అంటే దేశానికే ముప్పు వచ్చినట్లట..!

రఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో.. సీబీఐ దర్యాప్తు వద్దే వద్దని… సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో.. రఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు… దర్యాప్తు అవసరం లేదని ఓ రూలింగ్ ఇచ్చింది. దానిపై.. కొంత మంది.. కొత్త ఆధారాలతో .. రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించాలా వద్దా అన్నదానిపై.. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అవకతవకలు జరిగాయన్నదానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని… సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై.. కేంద్రం మొదట కౌంటర్ దాఖలు చేయాడానికి నాలుగు వారాల సమయం కోరింది. కానీ కోర్టు మాత్రం అంత సమయం ఇవ్వలేదు. దాంతో.. కేంద్రం.. అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో… పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై.. పెద్దగా వివరాలు బయట పెట్టలేదు కానీ… తీర్పుపై రివ్యూ అవసరం లేదని పదే పదే చెప్పుకొచ్చింది. సీబీఐ దర్యాప్తు అసలు అవసరం లేదని.. కాగ్ రిపోర్టును ఉదహరించింది. అసలు కాగ్‌ రిపోర్ట్‌పైనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి.

రాఫెల్ డీల్ విషయంలో… సీబీఐ విచారణ జరిగితే… దేశభద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్న రీతిలో.. మొదటి నుంచి… కేంద్రం బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని, రాఫెల్ డీల్‌లో లూప్ హోల్స్‌ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా యాంటీ నేషనల్ అనే ముద్ర వేసింది. ఇప్పుడు… విచిత్రంగా.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనూ అదే తరహా.. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ డీల్‌లో జోక్యం చేసుకున్న పత్రాలు నిజమేనని అంగీకరించినా… అవి చట్ట విరుద్ధంగా సేకరించారంటూ.. కేంద్రం వాదించింది. చట్టవ్యతిరేకంగా సంపాదించిన పత్రాల ఆధారంగా విచారణ చేపట్టడం వల్ల దేశ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. చివరకు ఇది దేశ ఉనికికే ఓ పెద్ద ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని అఫిడవిట్‌లో చాలా.. చాలా పెద్ద మాటలే చెప్పింది కేంద్రం.

రాఫెల్ డీల్ విషయంలో… జరిగిన ప్రతి ఒక్క డెవలప్‌మెంట్ కూడా అనుమానాస్పదమే. ఏ ఒక్కదానికి… కేంద్రం సరైన సమాధానం చెప్పలేదు. దేశ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టాలనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. కేంద్రం ఏ మాత్రం చలించడం లేదు. నిజానికి సీబీఐ విచారణ చేయించి.. క్లీన్ చిట్ ఇప్పించుకునే పరిస్థితి కేంద్రానికి ఉంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. అలోక్ వర్మ వివాదం తర్వాత.. సీబీఐని గతంలోలా ఉపయోగించుకునే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తోంది. దాంతో.. బీజేపీ సర్కార్ కూడా.. తన చేతుల్లో ఉన్న సీబీఐతోనే.. విచారణకు వెనుకడుగు వేస్తోంది. ఒక వేళ ప్రభుత్వం మారిదే.. మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా కావొచ్చన్న అంచనాలు సహజంగానే రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close