ఈడీతో సైడ్ బిజినెస్..! మరో “గాలి” నిర్వాకం బట్టబయలు..!!

కర్ణాటక భారతీయ జనతా పార్టీ అజ్ఞాత నాయకుడు, మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. బళ్లారి ఉపఎన్నికల్లో తన వర్గానికి చెందిన అభ్యర్థి ఘోర పరాజయం పాలవుతున్న సందర్భంలోనే ఆయన తలదాచుకోవడానికి పరారయ్యారు. అయితే.. ఓటమి అవమానంతో తల ఎవరికీ చూపించలేక కాదు.. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయంతో. గాలి జనార్ధన్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడానికి కారణం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులతో.. కలిసి… కేసుల మాఫీ చేయడానికి ప్రయత్నించడం. ఈ వ్యవహారం బయటకు రావడంతో.. గాలి జనార్ధన్ రెడ్డి పరారయ్యారు.

కర్ణాటకలో కొన్నాళ్ల క్రితం.. యాంబిడెంట్ మార్కెంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ… వ్యవహారం రచ్చ అయింది. పోంజీ స్కీములు నడిపి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. మనీ లాండరింగ్‌కు పాల్పడటంతో.. ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ యాంబిడెంట్ కంపెనీ.. గాలి జనార్దన్ రెడ్డి వద్దకు వచ్చింది. ఆయన ఈడీ కేసులు తీసేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ప్రతిగా తనకు డబ్బులు వద్దని చెప్పారు కానీ 57 కిలోల బంగారు కడ్డీలు మాత్రం తీసుకున్నారు. ఈడీ అధికారులకు… రూ. కోటి లంచం ఇచ్చారు. అయితే.. ఇది బయటపడిపోయింది. ఈ విషయం సాక్ష్యాలతో సహా… యాంబిడెంట్ కంపెనీలో సోదాలు చేసిన అధికారులకు దొరికిపోవడంతో.. గాలి జనార్ధన్ రెడ్డి కోసం.. వేట ప్రారంభించారు. ఈ విషయం తెలిసి ఆయన పరారయ్యారు.

అక్రమ మైనింగ్‌తో వేల కోట్లు సంపాదించిన గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన.. ఈడీ అధికారులకు లంచాలిచ్చి .. కేసులు కొట్టి వేయించేలా.. సైడ్ బిజినెస్ ప్రారంభించడం… కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి.. తెలిసింది.. ఇక ముసుగులో ఎన్ని జరిగాయో తేలాల్సి ఉంది. ఇప్పటికే.. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపైనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏకంగా గాలి జనార్ధన్ రెడ్డితో కలిసి.. ఈడీ అధికారులు.. కేసుల మాఫీ సైడ్ బిజినెస్ ప్రారంభించడం… దేశవ్యాప్తంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close