ఆర్థిక రాజధానిగా విశాఖ..! ఇది గంటా డిమాండ్..!

విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. రాజధాని విషయంలో ఇంత రగడ జరుగుతున్నప్పటికీ… సీనియర్ నేతగా.. గంటా శ్రీనివాసరావు ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ వేదికపై కూడా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది హఠాత్తుగా.. మీడియా ముందుకు వచ్చి… విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిపై జగన్ మౌనం.. ప్రమాదకరమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లయినా రాజధానిపై చర్చ జరగడం బాధాకరమని.. రాష్ట్రానికి దశదిశ నిర్ణయించేది రాజధానినేనన్నారు. టీడీపీ ఓడిపోయినప్పటి నుండి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. అసెంబ్లీలో సమావేశాల్లో గంటా ఎక్కడా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైసీపీపై విమర్శలు చేయలేదు. ఆ తర్వాత కూడా సైలెంట్ గానే ఉన్నారు.

పార్టీ మార్పు వార్తలు ఉద్ధృతంగా వచ్చిన సమయంలో మాత్రం.. ఒకసారి క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని.. పదే పదే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆయినప్పటికీ.. ఆయన అంటీముట్టనట్లుగా ఉండటంతో… ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. తాజాగా… విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ తో తెరపైకి వచ్చారు. దేశంలో ప్రత్యేకంగా ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని అంటూ అధికారికంగా ఏ నగరానికీ హోదా లేదు. కేంద్రంలో అయినా.. రాష్ట్రంలో అయినా. దేశానికి ఆర్థికంగా…. పిల్లర్ లా ఉంటుంది కాబట్టి.. ముంబైని ఆర్థిక రాజధానిగా పేర్కొంటారు.

వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా జరిగితే వాణిజ్య రాజధాని అని నిక్‌నేమ్ పెట్టి పిలుస్తారు. అంతే కానీ… ప్రత్యేకంగా హోదా ఏమీ రాదు. ఆ మాటకు వస్తే.. విశాఖకు… ఇప్పటికే.. ఏపీ ఆర్థిక రాజధాని అన్న పేరు ఉంది. మరి దీన్ని గంటా అధికారికంగా… ప్రకటించాలని… కోరుతున్నారేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close