హైదరాబాద్ జంట నగరాలలో 27, 12, 468 ఓట్లు రద్దు?

తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఇంకా ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియదు కానీ జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ఓటర్ల జాబితా నుండి తొలగించే కార్యక్రమం భారీ ఎత్తున చేప్పట్టింది. జి.హెచ్.యం.సి. పరిధిలో మొత్తం 27, 12, 468 మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించేందుకు నోటీసులు జారీ చేస్తోంది. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన కూకట్ పల్లి సర్కిల్లోనే ఏకంగా 1,21,085 ఓట్లను తొలగించారు.

కాంగ్రెస్, తెదేపా, బీజేపీలకి మంచి పట్టున్న ప్రాంతాలయిన ఖైరతాబాద్, ఉప్పల్, అమీర్ పేట్, బాలానగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాలలో ఈ ఓటర్ల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. రెండు ప్రాంతాలలో ఓట్లు ఉన్నవారు, స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపలేనివారు, ఇళ్ళకు తాళాలు వేసున్నవారికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన గడువులోగా స్పందించనివారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ తెలిపారు. సరయిన ఆధారాలు చూపిస్తే మళ్ళీ వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుతామని చెపుతున్నారు. జి.హెచ్.యం.సి.ఎన్నికలలో తెరాస పోటీ చేసి గెలవలేకనే జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను రద్దు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు పిర్యాదు చేసాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close