కండువా పడలేదు.. రంగు మారుతోంది!

అందరిలాగే తాము కూడా చేస్తే వెరైటీ ఏం ఉంటుందని అనుకున్నారో లేదా… వెల్లువలా వస్తున్న వారికి అదే పనిగా కండువాలు వేస్తూ ఫోటోలు దిగడానికి అవతల బాస్‌కు ఖాళీ లేదో ఏమో గానీ.. మొత్తానికి కండువాలు పడకుండానే.. తమ మీద ఉన్న పార్టీ రంగు మార్చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఆరికపూడి గాంధీ, మాగంటి గోపీనాధ్‌ తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా ముహూర్తం కూడా పెట్టుకున్నట్లుగా కొన్ని రోజుల కిందటే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారి తొందర గమనిస్తే.. ముహూర్తం దాకా కూడా ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అర్జంటుగా తమ మీద ఉన్న తెదేపా ముద్రను కడిగేసి.. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలని ఆరాటపడిపోతున్నట్లుంది. అందుకే తెరాసలో చేరి గులాబీ కండువాలు కప్పుకోక ముందే.. తమను తెరాస సభ్యులుగా గుర్తించాలంటూ.. ఆ ఇద్దరూ స్పీకరుకు లేఖ రాసుకున్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు తమను కూడా తెరాస సభ్యులుగా గుర్తించాల్సిందిగా కోరుతూ రాసిన లేఖ తెలంగాణ అసెంబ్లీ స్పీకరు కార్యాలయానికి బుధవారం నాడు చేరింది. దీంతో.. తెదేపానుంచి తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మొత్తం సంఖ్య 12కు చేరినట్లయింది. ఆ పార్టీ తరఫున గెలిచినదే 15 మంది. అందులో 12 మంది జెండా మార్చేశారు.

అయితే మాగంటి గోపీనాధ్‌, ఆరికపూడి గాంధీ ఇద్దరూ కూడా తెదేపా అధినేతలతో ఉన్న సాన్నిహిత్యం, సామాజిక వర్గ సమీకరణాల రీత్యా.. అంత సులువుగా ఆ పార్టీని వీడి రాకపోవచ్చునని చాలా మంది అంచనా వేశారు. దానికి తగినట్లే.. మాగంటి గోపీనాధ్‌కు ఓటుకు నోటు నోటీసులు వచ్చాయనే వార్తలు వచ్చినప్పుడు, గాంధీపై ఫిరాయింపు పుకార్లు వచ్చినప్పుడు వారు స్పందించిన తీరు కూడా.. పార్టీ మారకపోవచ్చునని అనిపించింది. కానీ కొన్ని వారాల వ్యవధిలోనే వారు పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. అధినేత వద్దకు వెళ్లి గులాబీ కండువాలు వేయించుకోవడానికంటె తొందర ఎక్కువ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ముందు స్పీకరుకు లేఖ రాసేశారు.

వీరిపోకతో.. సభలో తెదేపా బలం ముగ్గురు సభ్యులకు పడిపోయింది. ఆర్‌.కృష్ణయ్య తనకు తెలుగుదేశంతో సంబంధం లేదని ఆల్రెడీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి సండ్ర వెంకట వీరయ్య సంగతేంటే కొన్నాళ్లు వేచిచూస్తే గానీ తెలియదు. రేవంత్‌రెడ్డి వన్‌ మ్యాన్‌ ఆర్మీగా మారినా ఆశ్చర్యం లేదని పలువురు అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close