ఎంపీ గోరంట్ల మాధవ్‌కు తెలిసింది బెదిరించడమే..!

అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్… సీఐగా పని చేసినప్పటి తన అలవాట్లను మార్చుకోలేకపోతున్నారు. ఆ అలవాటు… ప్రతి ఒక్కరిని బెదిరించడం. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉంటే.. ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా ఒకప్పుడు విర్రవీగిపోయి… కేసుల పాలయిన చరిత్ర ఉన్న ఈ గోరంట్ల మాధవ్… కియా విషయంలోనూ… హాట్ టాపిక్ అయ్యారు. కియా తరలి పోతోందన్న ప్రచారం ప్రారంభమైన సమయంలో… గతంలో కియా యాజమాన్యాన్ని ఆయన బెదిరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అచ్చంగా అలానే… టీడీపీ ఎంపీల్ని బెదిరించేందుకు.. సాక్షాత్తూ లోక్‌సభలోనే ప్రయత్నించారు గోరంట్ల మాధవ్.

లోక్‌సభలో కియా తరలింపు గురించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రస్తావిస్తున్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వద్దకు… గోరంట్ల మాధవ్ దూసుకు వచ్చారు. రామ్మోహన్ నాయుడు సమీపానికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నారు. కానీ ఇంగ్లిష్, హిందీల్లో గోరంట్ల మాధవ్‌కు పెద్దగా పట్టు లేకపోవడంతో.. నోరు తెరిచారు కానీ ఏమీ చెప్పలేకపోయారు. ఈ లోపు చుట్టుపక్కల ఎంపీలు… పెద్ద పెట్టున నవ్వి… ఇదేం పద్దతని ప్రశ్నించడం.. టీడీపీ ఎంపీలు కూడా.. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన రామ్మోహన్ నాయుడు దగ్గర్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

మళ్లీ మధ్యలో ఆగి.. ఏమీ చేయకుండా వెళ్లిపోతున్నానని ఫీలయ్యారేమో కానీ.. మళ్లీ రామ్మోహన్ నాయుడు దగ్గరకు వెళ్లబోయారు. ఇతర ఎంపీలు.. గట్టిగా కేకలేయడంతో… వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి… ఇతర సభ్యులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే కియా ఎక్కడికి తరలి పోవడం లేదు.. టీడీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ… మిధున్ రెడ్డి లాంటి ఇతర ఎంపీలు… తమకు ప్రసంగించే సమయం వచ్చినప్పుడు చెప్పారు. అలా చెప్పలేకపోయిన గోరంట్ల మాధవ్.. టీడీపీ సభ్యుల్ని బెదిరించడానికి మాత్రం…ఆవేశంగా దగ్గరకు వెళ్లారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close