ఎన్ని సార్లు గ్యాస్ లీకైతే అన్ని కమిటీలు..పోతే ప్రాణాలేగా!?

విశాఖ బ్రాండిక్స్ సెజ్‌లో వరుసగా గ్యాస్ లీకవుతున్నాయి. వందల మంది కార్మికులు అనారోగ్యం పాలవుతున్నాయి. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా స్పందిస్తుంది. వారి ప్రాణాలకు పెద్దగా విలువ లేనట్లుగా వ్యవహరిస్తోంది. బ్రాండిక్స్ సెజ్‌లో ఉన్న సీడ్స్ పరిశ్రమలో కొద్ది రోజుల కిందట గ్యాస్ లీకయి వందల మంది ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. ఒక్కరికి రూపాయి సాయం చేయని ప్రభుత్వం కంపెనీపై కనీస చర్యలు తీసుకోలేదు. పైగా మంత్రి అమర్నాథ్ రెడ్డి సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు. ఏసీలోని గ్యాస్ లీక్ అయిందని చెప్పుకొచ్చారు. అప్పుడు విచారణకు కమటీ నియమించారు. కానీ ఆ కమిటీ ఏం తేల్చిందో ఎవరికీ తెలియదు.

తాజాగా మరోసారి గ్యాస్ లీక్ కావడంతో వందల మంది మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. ఆ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. పదే పదే కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ సీఎం జగన్ తీరిగ్గా సమీక్షా చేసి.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ అని ప్రకటించారు. నివేదిక కోసం ఆ కమిటీకి నెల గడువిచ్చారు. కానీ అప్పటికి మర్చిపోతారని అనుకుంటారు. గతంలో కమిటీ గురించి అంతే మర్చిపోయారు. అయితే ఈ సమస్యను జనరలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అన్నికంపెనీల్లో సెక్యూరిటీ ఆడిట్ చేయాలంటూ హడావుడి కూడా ప్రారంభించారు. గతంలో ఎల్జీ పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు ఇంత కంటే ఎక్కువ హడావుడి చేశారు. కానీ అది కేవలం పై పై ప్రకటనలే.. చర్యలేం లేవు. అందుకే ఇలావరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాల్సింది పోయి.. నాటకాలు.. ప్రకటనలతో మభ్యపెట్టి.. ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు అవకాశం కల్పిస్తోంది. గత మూడేళ్లలో అతి భారీ ప్రమాదాలు పలు చోట్ల చోటు చేసుకోవడమే దీనికి సాక్ష్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close