పవన్‌కు గవర్నర్‌ ఫోన్లు -టిడిపి ఆరోపణలు

గవర్నర్‌ నరసింహన్‌పై తెలుగుదేశం నాయకులు ఎప్పటికప్పుడు ఏవో విమర్శలూ ఆరోపణలూ చేస్తూనే వున్నారు. ఒక దశలోనైతే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు గనక తొలగించాలని కోరేవారు. విచిత్రంగా అప్పట్లో బిజెపి నేతలు కొందరు అందుకు వంతపాడారు. ఇటీవలి కాలంలో గవర్నర్‌పై టిడిపి విమర్శల తీరు మారింది.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆయనతో కలసి రాజకీయాలు నడుపుతున్నారనేది వారి తాజా ఆరోపణ. వైసీపీ నాయకులు సరే ప్రధాని మోడీని కలిశారు గనక మీరు ఆరోపణలు చేయొచ్చు. గాని పవన్‌కు సంబంధించి అలాటివి ఏమీ ఆధారాలు లేవు గదా అన్నప్పుడు గవర్నర్‌తో మంతనాలు జరపుతున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. అయితే ఎట్‌హౌంలో ఉభయ ముఖ్యమంత్రుల సమక్షంలో తప్ప మరోసారి పవన్‌ గవర్నర్‌ను కలిసిందే లేదన్నది జనసేన నేతల వివరణ. వారిద్దరూ కలిసి మాట్టాడినట్టు నిరూపించగలరా అని సవాలు విసురుతున్నారు. ఈ సవాలు స్వీకరించలేని టిడిపి నేతలు గవర్నర్‌ ఫోన్‌లో పవన్‌తో మాట్లాడుతున్నట్టు ఆధారాలు వున్నాయని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. మరి వారి ఫోన్లపై నిఘా వేస్తున్నారా అనే ప్రశ్న ఒకటైతే కాల్‌డేటాను బట్టి ఆరోపణలు చేయడం సమంజసమా అనే ప్రశ్న జనసేన వేస్తున్నది. కాల్‌డేటా కారణంగానే చంద్రబాబు నాయుడు ఆఘమేఘాల మీద హైదరాబాద్‌ నుంచి పలాయనం పాడారని వారు గుర్తు చేస్తున్నారు.

గవర్నర్లు ఎవరైనా ఎప్పుడైనా కేంద్రం నియమిస్తేనే ఇక్కడకు వస్తారు. ఎప్పటికప్పుడు వివరమైన నివేదికలు పంపిస్తుంటారు. పాలనా వ్యవహారాలపైనే గాక రాజకీయాలపైన కూడా ఈ నివేదికలు వెళుతుంటాయి.ఆ క్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ జనసేన కార్యకలాపాల గురించి కూడా నివేదిక పంపడం, ఆ విషయాలు ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరితో మాట్లాడి తెలుసుకోవడం టిడిపి అనుమానాలకు కారణమైనట్టు చెబుతున్నారు. కాని రాజ్యాంగ పరంగా ఈ ప్రక్రియను ఎవరూ చేయగలిగింది లేదు. పైగాగవర్నర్‌ ఏ పార్టీ వారినైనా అధికారికంగా కలుసుకోవచ్చు.మెమోరాండాలు ఆరోపణలు తీసుకోవచ్చు. కనుక పవన్‌ తో మాట్లాడారనే ఒక్క ఆరోపణతో అభాండాలు వేయడం తప్పని జనసేన ప్రతినిధులు గట్టిగా ఖండిస్తున్నారు. అయితే టిడిపి వారు మాత్రం తమ ఆరోపణలు ఆపే పరిస్థితి కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close