దళితుల్లో బిజెపి పై వ్యతిరేకత!

మత చాందసులు ఉత్తరప్రదేశ్ దాద్రి లో గోవు మాసం తిన్నాడన్న అభియోగంతో ఒక ముస్లింను చంపేసిన గాయం తగ్గుముఖం పట్టకముందే ఇదే అభియోగం మీద గుజరాత్ లోని ఉనా పట్టణంలో జూలై 11న నలుగురు దళితుల కాళ్లూ చేతులూ కట్టేసి అర్ధనగ్నంగా నిలబెట్టి దారుణంగా వారిని హింసించారు. ఈ సంఘటన రాష్ట్రంలో దళితులందరినీ సంఘటితం చేస్తోంది.

దాడికి వ్యతిరేకంగా అహ్మదాబాద్ నుంచి నెల 5న దాడి జరిగిన ఉనా పట్టణానికి పాదయాత్ర నిర్వహించేందుకు దళితులు సిద్ధమవుతున్నారు. దళితులపై దాడి చేసిన వారిని ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీ యాక్ట్(పాసా) కింద అరెస్టు చేసే వరకు ఆందోళనలు కొనసాగించాలని దళిత నేతలు నిర్ణయించారు.

దాడుల అంశంతో పాటు పలు డిమాండ్లను దళిత నేతలు సర్కారు ముందు ఉంచుతున్నారు. గోరక్షక దళాలపై చర్యలు తీసుకునే వరకూ పశువుల కళేబరాలను ముట్టుకోబోమని, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, 6వ పే కమిషన్ సిఫారసుల మేరకు జీతాలివ్వాలని కూడా వారు కోరుతున్నారు.

గుజరాత్ లోని 13 ఎస్సీ నియోజకవర్గాలకు 10 పదిచోట్ల బీజేపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరెవ్వరూ ప్రభుత్వాన్ని దళితుల ఆగ్రహం నుంచి అడ్డుకునే పరిస్థితి లేదు. గతవారం బీజేపీ దళిత ఎంపీ కిరీట్ సోలంకీ, ఎమ్మెల్యే రజనీకాంత పటేల్ నివాసాలను దళితులు ముట్టడించారు.

అసహనపరుల చర్యలవల్ల అంతకు ముందు దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పైకూడా ఇలాంటి దుమారాన్నే రేపాయి. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, పద్మా అవార్డులను ఎందరో ప్రముఖులు వాపసు ఇచ్చేశారు. దేశానికి చెందిన మేధావులు తమ అవార్డులను వాపసు ఇచ్చేస్తూ చేసిన మౌనపోరాటం దేశవిదేశాల్లో భారత్ పరువు ప్రతిష్టల్ని దిగజార్చింది. దేశంలో స్వేచ్ఛగా ఆలోచించలేని వాతావరణాన్ని నిరసిస్తూ ఎంతో మంది సాహితీవేత్తలు తమకు అందిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేసిన వైనం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తలవంచుకునేలా చేసింది.

గుజరాత్ లోని దళితుల ఆందోళనకు అధికశాతం ముస్లింలు మద్దతిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి బీజేపీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోంది.

వీటిని చెదురు మదురు సంఘటనలగానో, కాకతాళీయాలుగానో భావించే వీలు లేదు. హిందూభావజాలం తీవ్రంగా వున్న పరివారం కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నందున ఇప్పుడే హిందూ అనుకూల రాజ్యం స్థాపించాలని భావిస్తున్నారు.

విశ్వహిందూపరిషత్, ఆర్ఎస్ఎస్‌లు దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్‌లు కూడా సిద్ధం చేస్తున్నాయన్న ఆరోపణలు వున్నాయి. అందుకు అనుగుణంగానే బిజెపికి చెందిన ఎంపిలు విచ్చల విడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బిజెపి నాయకులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే ఇప్పటికే ఆందోళనగా ఉన్న హిందూయేతర మతాల వారు మరింత వత్తిడికి గురికావచ్చునని నిఘావర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయని కూడా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close