క్రైమ్ : భార్య అందమైదే కానీ మనసు క్రూరం..!

గుంటూరు జిల్లా పెదకూరపాడు పోలీసులు అశోక్ రెడ్డి, సాయికుమారి అనే జంటను అరెస్ట్ చేశారు. వీరు జంటే కానీ.. భార్యాభర్తలు కాదు. కానీ వారి మధ్య వివాహేతర బంధం ఉంది. అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బంధాన్ని మరింత గట్టిపరుచుకునేందుకు హత్యకు పాల్పడ్డారు. తన భర్తను ప్రియుడు అశోక్ రెడ్డితో కలిసి సాయికుమారి చంపేసింది. అది కూడా అలా ఇలా కాదు.. రెక్కీ నిర్వహించి.. కుక్కను శాంపిల్‌గా మర్డర్ చేసి.. ఆ తర్వాత భర్తను మట్టు పెట్టింది. దీనికి కర్త, కర్మ, క్రియగా ప్రియుడు అశోక్ రెడ్డి నిలిచాడు.

భాష్యం బ్రహ్మయ్య అనే వ్యక్తి.. పాల వ్యాపారం చేస్తూ ఉన్నంతలో భార్య సాయికుమారిని కష్టపెట్టకుండానే చూసుకునేవాడు. అయితే.. ఆమె ఇంకేదో కోరుకుంది. తన అందానికి అందరూ దాసోహం అవుతారనుకుంది. ఎక్కడా చూడని సుఖాలు ఆశించింది. ఆ క్రమంలో అశోక్ రెడ్డి అనే అతను పరిచయం అయ్యాడు. అతనితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఇప్పుడు సాయికుమారి, అశోక్ రెడ్డికి బ్రహ్మయ్యే అడ్డం అనిపించాడు. అతన్ని ఎవరికీ దొరకుండా అడ్డు తొలగించుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించి.. తమ ఇంటర్నెట్ తెలివి తేటలతో సైనేడ్‌నే గొప్ప ఆయుధంగా భావించారు. ఓ సైనెడ్ కొనుక్కొచ్చి ముందుగా కుక్కపై ప్రయోగించారు. అది స్లో పాయిజన్‌గా మారి.. కాసేపటికే కుక్క చనిపోవడంతో ఆ ప్లాన్ అమలు చేశారు.

బ్రహ్మయ్య ఓ సారి.. వ్యాపారం పని మీద వెళ్లి వస్తూండగా.. గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. వారు ఆయనపై సైనెడ్ కెమికల్ పూసి పరారయ్యారు. అది సైనెడ్ అని తెలియని బ్రహ్మయ్య.. ఊళ్లోకి వచ్చాడు. కానీ సైనెడ్ ప్రభావం చూపిస్తున్న కొద్దీ నీరసపడిపోయి రోడ్డుపై పడిపోయాయి. వెంటనే అతన్ని గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. అయితే అది హత్య అని.. సైనెడ్ గురించి చెప్పడంతో పోలీసు కేసు నమోదయింది. అక్కడే కథ అడ్డం తిరిగింది.

ఆ ఊరికి సంబంధించిన సెల్ ఫోన్ టవర్స్ కాల్స్ అన్నీ విశ్లేషిస్తే.. సాయికుమారి, అశోక్ రెడ్డిల కుట్ర బయటపడింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దారి తప్పిన భార్య కుటుంబాన్ని ఛిద్రం చేస్తుందనే విషయాన్ని సాయికుమారి మరోసారి నిరూపించింది. వివాహేతర బంధాల కోసం నీచానికి పాల్పడే అశోక్ రెడ్డి కటకటాల పాలయ్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close