పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేది లేదంటున్నజీవీఎల్ ..!

పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఒక్క శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉన్న బీజేపీ కూడా అంగీకరించడం లేదు. జనసేన నాయకులు పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని వరుసగా డిమాండ్ చేస్తున్నారు. పోతిన మహేష్ లాంటి నేతలు సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ జీవీఎల్ నరసింహారావు గంటల్లోనే వారి గాలి తీసేశారు. ఇప్పుడల్లా అలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని తేల్చారు. నడ్డా పర్యటనలో ఎలాంటి ప్రకటన ఉండదని జీవీఎల్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనేది తమ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని.. జాతీయ స్థాయిలో నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆయన కవర్ చేస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో అలాంటి నిర్ణయమేదీ తీసుకోకుండానే ప్రకటించి.. ఎన్నికలయిన తరవాత యూటర్న్ తీసుకున్న విషయం జీవీఎల్‌కు గుర్తున్నట్లుగా లేదు. అయినా ఏపీకి సంబంధించినంత వరకు జనసేన మేజర్ పార్టీ. ఏ ఎన్నికలు జరిగినా అదే విషయం స్పష్టమవుతోంది. లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనతో పొత్తు ఉన్నా.. బీజేపీ కనీస స్థానాలను గెల్చుకోలేకపోయింది.

కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా బీజేపీకి లేవు. ఆ పార్టీలో పవన్ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నాయకుడు లేరు. అయినప్పటికీ పవన్ ను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలంటే తమను బతిమాలుకోవాలన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ తీరుపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. కానీ బయటపడలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close