హోదా గురించి మాట్లాడితే ఇబ్బందులే..! జగన్‌కు జీవీఎల్ వార్నింగ్..!

ప్రత్యేకహోదా గురించి మాట్లాడితే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బంది పడతారని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. జగన్మోహన్ రెడ్డి..ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన విషయం మీడియాలో హైలెట్ అయింది. దీనిపై జీవీఎల్ ఆవేశపడ్డారు. ప్రత్యేకహోదా అనేది అంతరించిపోయిన వ్యవస్థ అన్నారు. గత టీడీపీ లాగే.. బీజేపీపై హోదా పేరుతో నిందలు వేయడానికి ప్రయత్నిస్తే.. జగన్ .. టీడీపీ ఎదుర్కొన్న పరిణామాలనే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లేని వ్యవస్థ కోసం మాట్లాడితే..జగన్‌ రాజకీయంగా ఇబ్బంది పడతారన్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని జగన్‌కి కూడా తెలుసని అయినా.. లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో.. రాజధానులు మార్చుకుంటామంటే.. సహకరిస్తామన్నట్లుగా మాట్లాడారు. రాజధానిని నోటిఫై చేస్తూ..గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలా శాసనం కాదని.. ఇప్పుడు మళ్లీ జగన్ జీవో ఇస్తే.. కేంద్రం నోటిఫై చేస్తుందని చెప్పుకొచ్చారు. అంటే.. ప్రత్యేకహోదా గురించి మాట్లాడకపోతే… రాజధాని గురించి కేంద్రం మాట్లాదన్నట్లుగా… జీవీఎల్ ఆఫర్ ఇచ్చినట్లుగా ఆయన ప్రకటన ఉంది. హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా గురించి లేఖ రాయడం…బీజేపీ వర్గాలను సైతం నివ్వెర పరిచినట్లుగా తెలుస్తోంది.

ఇంత కాలం ఓ అండస్టాండింగ్‌తోనే జగన్ హోదా మాటలను పక్కన పెట్టారని భావిస్తున్నారు. మొదట్లో.. ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తిన జగన్.. తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీంతో.. బీజేపీకి కోపం వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి జగన్‌కు వచ్చిన ప్రత్యేకమైన వార్నింగ్‌లు లేవు. కానీ ఈ విషయంలో మాత్రం.. జీవీఎల్ మాటలు కఠువుగానే ఉన్నాయి. జగన్ … హోదా అంశాన్ని మరింత పెద్దది చేస్తారో.. జీవీఎల్ బెదిరింపులకు భయపడి.. ఆపేస్తాో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close