హాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ ది కాదని ఇప్పుడే తెలిసిందా..!

అగ్రిగోల్డ్ కేసు అనూహ్య మ‌లుపు తిరిగింద‌ని చెప్పుకోవచ్చు! హాయ్ ల్యాండ్ ఆస్తి త‌మ‌ది కాదంటూ హైకోర్టులో అగ్రిగోల్డ్ సంస్థ చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. దీంతో అగ్రిగోల్డ్ సంస్థ‌పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హాయ్ ల్యాండ్ కు సంబంధించిన ఇంత‌టి కీల‌క స‌మాచారాన్ని విచార‌ణ‌లో భాగంగా ఇన్నాళ్లూ ఎందుకు చెప్ప‌లేదంటూ నిల‌దీసింది. హాయ్ ల్యాండ్ ఎండీ వెంక‌టేశ్వ‌ర్రావుపై విచార‌ణ‌కు సీఐడీని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు, అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంపై సీఐడీ చేస్తున్న విచార‌ణపై కూడా న్యాయ‌స్థానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సిట్ ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు జ‌రిపించాలంటూ కోర్టు చెప్పింది.

దీంతో, ఇన్నాళ్లూ సీఐడీ దీనిపై ఏం చేసింద‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి..? హాయ్ ల్యాండ్ ఎవ‌రిది..? ఎవ‌రి పేరున రిజిస్ట్రేష‌న్ జ‌రిగింది..? దాన్లో భాగ‌స్వాములు ఎవ‌రున్నారు, ఏవైనా వివాదాలున్నాయా… ఇలాంటి ప్రాథ‌మిక విష‌యాల‌ను కూడా ద‌ర్యాప్తులో భాగంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌రగ‌లేదా అనిపిస్తోంది! గ‌డ‌చిన మూడేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు ఆవేద‌న‌తో ఉన్నారు. ఇంకోప‌క్క‌, ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ పార్టీలు కూడా ఎవ‌రి అజెండాతోవారు ఆందోళ‌న‌లు చేస్తున్న ప‌రిస్థితి. ఇంత జ‌రుగుతున్నా, కోర్టుకు స‌రైన వివ‌రాల‌ను ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో సీఐడీ ఉందా అనే విమ‌ర్శ‌లూ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అగ్రిగోల్డ్ కి ఉన్న ఆస్తుల్లోనే అతిపెద్ద‌ది ఈ హాయ్ ల్యాండ్‌. కొన్ని వంద‌ల కోట్ల విలువ ఉంటుంది. ఇంకోప‌క్క‌, అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లింపుల విష‌య‌మై ప్ర‌భుత్వ‌మూ త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూ, ఆ ఆస్తుల్ని అమ్మ‌కానికి పెట్టి ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వేలం ప్ర‌క్రియ‌కు కూడా వెళ్లింది. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడీ ఆస్తులు త‌మ‌వి కావు అంటూ సంస్థ చెప్ప‌డం, ఈ మొత్తం కేసులోనే కీల‌క మ‌లుపు అనుకోవ‌చ్చు. దీంతో ఇప్ప‌టికే త‌మ సొమ్ము తిరిగి వ‌స్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న బాధితుల‌కు, తాజా ప‌రిణామం మ‌రింత టెన్ష‌న్ పెంచేదిగా మారింది. ఏదేమైనా, ద‌ర్యాప్తులో సీఐడీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్న ప‌రిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close