పోలవరం రివర్స్ టెండర్లపై స్టే ఎత్తేసిన హైకోర్టు

పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ విషయంలో.. హైకోర్టు స్టే ఎత్తి వేసింది. కొత్తగా.. రూ. ఎనిమిది వందల కోట్లు తక్కువకు పనులు చేసేందుకు రివర్స్ టెండర్ వేసిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి హైకోర్టు అవకాశం కల్పించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే.. పాత కాంట్రాక్టర్ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీని తప్పించిన ఏపీ సర్కార్.. వెంటనే.. రివర్స్ టెండర్లను పిలిచింది. తమను తప్పించడంపై.. నవయుగ సంస్థ కోర్టుకెళ్లింది. అయితే.. నవయుగ సంస్ధ పోలవరం ప్రాజెక్టు పనులపై కోర్టులో పిటిషన్ వేయలేదు. ఒక్క విద్యుత్ కేంద్రం టెండర్లపైనే పిటిషన్ వేసింది. అయితే.. ఏపీ సర్కార్.. అటు పోలవరం మిగిలిన పనులు… విద్యుత్ కేంద్రం కలగలపి… రివర్స్ టెండర్లు పిలిచింది.

దీంతో.. కోర్టు స్టే వెకేషన్ ఉత్తర్వులు కూడా.. రెండింటికి వర్తించే అవకాశం ఉందని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనులు గత ఐదు నెలలుగా నిలిచిపోయాయి. వరదల సమయంలో పనులు జరగవని ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పుడు..కూడా మరో రెండు నెలల పాటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. మేఘా సంస్థతో రివర్స్ టెండరింగ్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఇలా చేసుకోవాలంటే.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ పర్మిషన్ తీసుకోవాలి. గత పీపీఏ సమావేశంలో జరగాల్సిన పనులకు.. రివర్స్ టెండర్లో పిలిచిన పనులకు మధ్య తేడాను గుర్తించారు. ఈ క్రమంలో.. పీపీఏ వెలిబుచ్చే సందేహాలను క్లియర్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

అది పూర్తయిన తర్వాత… మేఘా కంపెనీ పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత భారీ మెషినరీ అవసరం. వాటిని తెప్పించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. న్యాయపరంగా పోలవరం ప్రాజెక్టులు అడ్డంకులు తొలగినట్లుగా భావించవచ్చు. నవంబర్‌లో పనులు ప్రారంభించి.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో మొదటి అడ్డంకిని అధిగమించినట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close