హైకోర్టు తీర్పుతో ఏపీ సర్కార్ దారిలోకి..! ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీ..!

ఇంటలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సభ్యులతో కొత్త ప్యానల్‌ను ఎన్నికల కమిషన్‌కు పంపాలని నిర్ణయించారు. అంతకు ముందు హైకోర్టు ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది. బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో.. బదిలీ నిర్ణయం తీసుకుంది. తాత్కలికంగా ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌లో సీనియర్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. డీజీపీ ఆఫీస్‌లో వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం కోరింది. ఎన్నికలకు సంబంధించిన విధులు ఇక ఏబీ వెంకటేశ్వరరావు నిర్వహించారు. దీనికి సంబంధించి జీవో నెం. 750ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కీలక పోలీసు అధికారుల్ని బదిలీ చేయించాలని.. చాలా రోజులుగా.. వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పదే పదే పోలీసులపై ఆరోపణలు చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. చివరికి కడప, శ్రీకాకుళం ఎస్పీలతో పాటు.. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయించగలిగారు. అయితే.. ఎన్నికల సంఘం వీరిని ఎందుకు బదిలీ చేసిందో కారణాలు చెప్పకపోవడం వివాదాస్పదమయింది. వైసీపీ ఫిర్యాదు చేస్తే ఈసీ అధికారులు దానిపై కనీస పరిశీలన చేయకుండా చర్యలు తీసుకోవడం ఏమిటన్న చర్చ జరిగింది. ఇదంతా రాజకీయ కుట్ర అని భావించిన టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. అయితే.. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది.

మామూలుగా అయితే.. ఈసీ ఉత్తర్వుల విషయంలో .. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని.. ప్రభుత్వం కూడా అనుకోలేదు. అందుకే..ఇంటలిజెన్స్ డీజీకి ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిస్తూ ప్రత్యేకమైన జీవో తెచ్చింది. అయితే.. పోలీసు వ్యవస్థలో… ఇంటలిజెన్స్ కూడా భాగమని.. ఈసీ వాదించింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి.. యంత్రాంగంపై.. ఈసీకి సర్వ హక్కులు ఉంటాయని వాదించారు. బదిలీకి కారణాలు చెప్పాల్సిన పని లేదని.. సీఈవో మీడియాకు చెప్పారు. దాంతో.. ఈసీ కావాలనే బదిలీలు చేసందని క్లారిటీ వచ్చింది కానీ.. ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్లిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close