బీజేపీ నేతల రాయలసీమ వాదం వెనుక హైకోర్టు తరలింపు వ్యూహం…?

అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందుగా హైకోర్టును కర్నూలు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఢిల్లీ న్యాయవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో అమిత్ షాతో కొద్దిరోజుల కిందట జరిగిన సమావేశంలో.. జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై చర్చించారని.. జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరో వైపు బీజేపీ కూడా దానికి సానుకూలంగా ఉంది. అక్కడ సెంటిమెంట్ పెంచడానికి… బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం… బీజేపీ నేతలు… రాయలసీమలో సమావేశమయ్యారు. ఎజెండా ఏమిటో ఎవరికీ తెలియనివ్వలేదు. కానీ ఏపీ సర్కార్.. రాయలసీమకు హైకోర్టు మార్చాలనుకుంటోందని.. దానికి తగ్గట్లుగా.. రాయలసీమ నేతలు.. గ్రౌండ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్న సందేశం వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల న్యాయవాదులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. వీరికి జీవిఎల్ , టీ.జీ. వెంకటేష్ లాంటీ బిజేపి ఎంపీలు మద్దతు ప్రకటించారు.

ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన ఎంపీలతో కలిసి.. రాయలసీమలో సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తామని.. జీవీఎల్ కూడా ప్రకటించారు. గతంలో ఎప్పుడూ చేయని విధంగా బీజేపీ నేతలు ఎందుకు హడావుడి చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దీనికి కారణం… హైకోర్టు తరలింపేనని… న్యాయవాదులు నమ్ముతున్నారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ.. మంత్రి బొత్స ప్రకటించిన తర్వాత రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లాయర్లకు వచ్చింది. హైకోర్టును రాయలసీమకు తరలిస్తారనే ప్రచారం న్యాయవాదులలో ఆందోళన రేపింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కావాలంటూ ఐదు జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు.

పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకూ గల బార్‌ ఫెడరేషన్లతో కూడిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ గవర్నర్‌ విశ్వభూషణ్‌హరిచందన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చింది. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన అందజేయాలని వారు ప్రయత్నించారు. కానీ వారికి సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ప్రభుత్వం హైకోర్టు విషయం లో స్పష్టమైన ప్రకటన చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలో వ్యవహరించినట్లుగానే… గుంభనంగా ఉంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close