స్మృతి ఇరానీ, సదానంద గౌడల శాఖల బదిలీ

నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా 19మందిని కేంద్రమంత్రులుగా చేర్చుకోగా, పనితీరు సంతృప్తికరంగా లేని కారణంతో కొందరు సీనియర్ మంత్రులను వేరే శాఖలకి మార్చారు. మొదటి నుంచి అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా నిలుస్తున్న మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీని చేనేత, జౌళి శాఖకి మార్చారు. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడని గణాంకాల శాఖకి మార్చారు. చౌదరి బీరేంద్ర సింగ్ ని గనుల శాఖకి మార్చారు.

ఇంతవరకు స్మృతీ ఇరానీ నిర్వహిస్తున్న మానవ వనరుల శాఖని క్యాబినెట్ హోదా కల్పించబడిన ప్రకాష్ జవదేకర్ కి అప్పగించారు. న్యాయశాఖని రవిశంకర్ ప్రసాద్ కి అప్పగించారు. సమాచార, ప్రసార శాఖని వెంకయ్య నాయుడుకి అప్పగించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖని నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడుకి ఇది అదనపు బాధ్యత అవుతుంది. కానీ ఆయన నిర్వహిస్తున్నపార్లమెంటరీ వ్యవహారాల శాఖని కర్నాటకకి చెందిన అనంతకుమార్ అప్పగించారు. విజయ్ గోయల్ కి క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, అనిల్ మాధవ్ దవేకి స్వతంత్ర హోదాతో అటవీ, పర్యావరణ శాఖ దక్కింది.

స్మృతీ ఇరాని, సదానంద గౌడ, చౌదరి బీరేంద్ర సింగ్ వంటి సీనియర్ మంత్రులని ఎటువంటి మొహమాటం లేకుండా అప్రదాన్యమైన వేరే శాఖాలకి మార్చడం, బాగా పని చేసిన వారికి పదోన్నతి కల్పించడం లేదా కీలకమైన శాఖలు కట్టబెట్టడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రులకి చాలా బలమైన సందేశమే ఇచ్చినట్లు భావించవచ్చు.

అయితే ఆర్.ఎస్.ఎస్. మద్దతు ఉన్న బండారు దత్తాత్రేయ, తవార్ చాంద్ గెహ్లాట్ ల పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ వారిని తమ పదవులలో కొనసాగనీయడం విశేషమే. ఇక ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ల శాఖల మారుస్తారన్న వార్తలు నిజం కాదని స్పష్టం అయింది.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆయనని హోంమంత్రి పదవిలోనే కొనసాగించారు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్న కారణంగా లేదా ప్రత్యర్ధ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లను ఇంకా ఖరారు చేయనందున లేదా అసలు ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే ఆలోచన లేకపోవడం చేత ఆయనని అదే పదవిలో కొనసాగించినట్లు భావించవలసి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన కార్యక్రమాలు ముగిసాయి కనుక మోడీ ప్రభుత్వం ఇంక ఈనెల 18 నుండి మొదలవబోయే పార్లమెంటు సమావేశాలకి సిద్దంగా ఉన్నట్లే భావించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close