“మర్కజ్” కేసులు తగ్గితే వైరస్ కట్టడి అయినట్లే..!?

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు మూడు వేలు దాటిపోయాయి. గత నాలుగైదు రోజుల్ని ఉద్ధృతంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే… భారత్‌లో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అనిపిస్తుంది. కానీ.. కొన్ని రకాల విశ్లేషణలు చూస్తే.. కరోనాను..భారత్ కట్టడి చేసిందన్న అభిప్రాయం కలుగుతుంది. అదేమిటంటే.. గత నాలుగైదు రోజుల్ని.. బయట పడుతున్న కేసుల్లో 90 శాతానికిపైగా ఢిల్లీలోని తబ్లిగీ జమాతే మత సమవేశాలకు హాజరైన వారివే. ఈ సమావేశాలకు వెళ్లిన వారందర్నీ గుర్తించి.. ఎక్కడిక్కడ టెస్టులు చేయిస్తూ… పాజిటివ్ వచ్చిన వారిని…వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఈ కారణంగానే… పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం కానీ.. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ.. తబ్లిగీ జమాతే ప్రార్థనల వల్ల.. కరోనా వ్యాపిస్తుందని అస్సలు అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వాల దృష్టి అంతా.. విదేశాల నుంచి వచ్చే వారిపైనే ఉంది. ఫిబ్రవరి నుంచి దేశంలోకి వచ్చిన వారి వివరాలన్ని దగ్గర పెట్టుకుని వారందర్నీ క్వారంటైన్ చేయడంపైనే ఉంది. కరోనా లక్షణాలున్న వారిని ట్రేస్ చేయడానికే అధికారులు సమయం వెచ్చించారు. ఇప్పుడు… ఆ విదేశాల నుంచి వచ్చిన వారందరి క్వారంటైన్… ఏడో తేదీతో పూర్తయిపోతుంది. వైరస్ సోకిన పధ్నాలుగు రోజులకు లక్షణాలు బయటపడతాయి. ఈ లోపు ఎవరికైనా కరోనా సోకి ఉంటే.. వారందరికీ బయటపడేది. అలా బయటప డిన వాళ్లందరూ బయటకు వచ్చారు. మిగిలిన వారికి లేనట్లే. అంటే… తబ్లిగీ సభ్యులు లేకపోతే…భారత్‌లో … కరోనా చాలా తక్కువ స్థాయిలోనే ఉండేది.

తబ్లిగీ సభ్యుల వైపు నుంచి ఇంతా పెద్ద ముప్పు ఉంటుందని ఊహించలేకపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా… ఏప్రిల్ ఏడో తేదీ కల్లా.. తెలంగాణను కరోనా ఫ్రీ స్టేట్‌గా చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం..దేశంలోనే అతి తక్కువ కరోనా కేసులున్న రాష్ట్రమని … క్లెయిమ్ చేసుకుంది. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం తబ్లిగీ సభ్యులు…వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకిన కేసులు మాత్రమే పాజిటివ్‌గా తేలుతున్నాయి. భారత్‌లో కరోనా టెస్టులు పరిమితంగానే జరుగుతున్నాయి. అదే సమయంలో..కరోనా లక్షణాలతో పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో ఎవరూ చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నారు. అనుమానితులు భారీగా ఉండటం లేదు. ఇవన్నీ మంచి సంకేతాలేనన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close