టీడీపీ ఓడిపోతే కేసీఆర్ కి ఏపీ సామంత రాజ్య‌ం..?

‘మా పార్టీ స‌మాచారం తీసుకెళ్లి వైకాపాకు ఇవ్వ‌డానికి మ‌ధ్య‌లో కేసీఆర్ ఎవ‌ర‌’ని మండిప‌డ్డారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ముందు ఇలాంటి ప‌నికి పాల్ప‌డ‌టం వారి అహంభావానికి సాక్ష్య‌మ‌న్నారు. చేసిన త‌ప్పును స‌మ‌ర్థించుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌మాచారం పోయిందంటూ చెబుతున్నార‌నీ, ‘మా ప్ర‌భుత్వ స‌మాచారం పోయింద‌ని చెప్ప‌డానికి మీరెవ‌ర’నీ, ‘మా స‌మాచారం పోలేద‌ని మేం చెబుతున్నామ‌’ని సీఎం అన్నారు. ఈ రాష్ట్రం మీద అంత ప్రేమే ఉంటే విద్యుత్ తీసుకుని రూ. 5 వేల కోట్లు ఏపీకి ఇవ్వాల్సి ఉంద‌నీ, అవి ఇవ్వ‌లేద‌నీ, పోల‌వ‌రం మీద ఎందుకు కోర్టుకు వెళ్లారంటూ తెలంగాణ సీఎంను ప్ర‌శ్నించారు. ఇక్క‌డి ప్ర‌తిప‌క్షం ఇలాంటివి ఎందుకు అడ‌గ‌ద‌న్నారు.

తెరాస‌, వైకాపా, భాజ‌పా.. ఈ ముగ్గురూ క‌లిసి సిగ్గుకూడా ప‌డ‌కుండా కుట్ర‌లు చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి విమ‌ర్శించారు. ‘ఆయ‌నొస్తే నేను ఓడిపోతా అంటూ కేసీఆర్ బెదిరిస్తున్నారు, నేను ఓడిపోతే నీకు ఇక్క‌డ సామంత రాజ్యం కావాలి. ఆ సామంత రాజ్యం ఎవ‌రిస్తారు… జ‌గ‌న్ ఇస్తారు. ఎందుకంటే, ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లున్నాయి కాబ‌ట్టి, కోర్టుల‌కు వెళ్లాలి కాబ‌ట్టి. ఈ రాష్ట్రంతో నీకు ఉన్న సంబంధ‌మేంటి? హ‌క్కేంటి?’ అంటూ కేసీఆర్ ని ఉద్దేశించి మండిప‌డ్డారు. తెలంగాణ‌లో టీడీపీ ఉంది కాబ‌ట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేశామ‌నీ, ఏపీలో ఏ సంబంధం లేక‌పోయినా రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ అంటున్నార‌ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారం లేక‌పోతేనే ఇన్ని దౌర్జ‌న్యాలూ అరాచ‌కాలూ చేసేవాళ్ల‌తో రేప్పొద్దున ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. త‌ప్పుడు ప‌నుల‌కు పార్టీ కార్య‌క‌ర్త‌లను ఉప‌యోగించుకోవ‌డం స‌రికాద‌న్నారు. జైళ్ల‌కు తీసుకెళ్ల‌డం వీళ్ల‌కి అలవాట‌నీ, ఇంత‌కుముందు ఆఫీస‌ర్ల‌నీ పారిశ్రామిక‌వేత్త‌ల్నీ తీసుకెళ్లార‌నీ ఎద్దేవా చేశారు. ఓట్ల తొల‌గింపు ఫిర్యాదులు చెయ్య‌డాన్ని తాను త‌ప్పుబ‌ట్ట‌డం లేద‌నీ, తిరిగి వాళ్లే ఆ నేరానికి పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. ఇలాంటి ప‌నులు క‌రుడుగ‌ట్టిన నేర‌స్థులు త‌ప్ప ఎవ్వ‌రూ చెయ్య‌లేర‌న్నారు. ఇప్పుడు వీళ్లు చేస్తున్న‌ది శిక్షార్హ‌మైన నేర‌మ‌నీ, కోర్టుకు వెళ్లి శిక్ష‌ప‌డే వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌మ‌న్నారు.

డాటా చోరీ వ్య‌వ‌హారంతో వైకాపా, తెరాస‌ల రాజ‌కీయ ల‌క్ష్యం ఏంట‌నేది వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు సీఎం. కేసీఆర్ ఆడిన‌ట్టుగా జ‌గ‌న్ ఆడుతున్నార‌నీ, జ‌గ‌న్ ను అడ్డం పెట్టుకుని ఆంధ్రా రాజ‌కీయాల‌ను చేతుల్లోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేస్తున్నార‌నే అంశాన్ని ప్ర‌ముఖంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే అంశాన్ని రాబోయే ఎన్నిక‌ల్లో ఒక ప్ర‌ధాన ప్ర‌చారాంశంగా ప్ర‌జ‌ల్లోకి టీడీపీ తీసుకెళ్లే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close