ఇండస్ట్రీని షాక్‌కి గురి చేస్తున్న సుకుమార్‌ డెసిషన్‌!

డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలు తీస్తూ తన రూటు సెపరేటు అనిపించుకుంటున్న సుకుమార్‌ లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ వంటి ఫీల్‌గుడ్‌ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లపరంగా అందరూ హ్యాపీగానే వున్నారు. ‘మా నాన్న నాకు ఎంతో ప్రేమను పంచాడు. కానీ, నేను హైదరాబాద్‌ వచ్చేసిన తర్వాత సినిమాల బిజీలో పడిపోయి నేనే నాన్నను బాగా చూసుకోలేకపోయాను. మా నాన్న మీద నాకు వున్న ప్రేమవల్లే ఇలాంటి ఫీల్‌గుడ్‌ మూవీ తియ్యగలిగాను’ అంటున్నాడు సుకుమార్‌.

‘నాన్నకు ప్రేమతో..’ తర్వాత సుకుమార్‌తో సినిమా చెయ్యాలని చాలా మంది హీరోలు, నిర్మాతలు ఎదురుచూస్తున్న తరుణంలో సుకుమార్‌ ఒక షాకింగ్‌ డెసిషన్‌ తీసుకున్నాడట. దేవిశ్రీప్రసాద్‌ని హీరోగా పరిచయం చేస్తూ తన నెక్స్‌ట్‌ మూవీ చెయ్యాలని డిసైడ్‌ అయిన సుకుమార్‌ ఈ సినిమా తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేసి డైరెక్టర్‌గా రిటైర్‌ అవుతానని అంటున్నాడు. సుకుమార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో హీరోలు, నిర్మాతలు షాక్‌ అవుతున్నారు. అయితే తన నిర్ణయంలో మార్పులేదని కూడా చెప్పినట్ట తెలుస్తోంది. కాబట్టి దేవిశ్రీప్రసాద్‌ సినిమా తర్వాత సుకుమార్‌తో సినిమా చేసే ఛాన్స్‌ కోసం హీరోలంతా ఎదురుచూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close