మిత్రుడికి కనీసం సంఘిభావం చెప్పని ఏపీ బీజేపీ !

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తిట్ల దండకం వినిపించడంపై ఏపీ బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తమ మిత్రునికి కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వడం లేదు. ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. దీంతో  బీజేపీ నేతల తీరుపై జనసేనలోనూ అసహనం కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా వచ్చి ప్రెస్‌మీట్లుపెడుతున్నారు. వాటిలో అసభ్యకరమైన భాష వాడుతూ తిట్లు లంకించుకుటున్నారు.

చివరికి ఇటీవలి కాలంలో బయటకు రాని పోసాని కృష్ణమురళితోనూ తిట్టించారు. ఈ క్రమంలో జనసేన నేతలు కూడా వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తిట్లతోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారి వాయిస్ పెద్దగా బయటకు రావడం లేదు. మిత్రపక్షం తరపున బీజేపీ నేతలు ఎవరైనా బయటకు వస్తారేమో అని చూస్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. పవన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకున్న  సోము వీర్రాజు కు కూడా.. తమ సీఎం అభ్యర్థిని బూతులు తిడుతున్నారన్న అంశాన్ని ఖండించాలని అనిపించలేదు.

బీజేపీ నేతల తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో ఉండి కంటి తుడుపుగాఓ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడకంకరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. కానీ జబీజేపీ నేతలకు జనసేన విషయంలో మంచి అభిప్రాయం లేదని వారికి వైసీపీనే ఇష్టమన్న అభిప్రాయం మాత్రం పవన్ కల్యాణ్ సేనలో ప్రారంభమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close