బెంగాల్ టైగర్ వినూత్న ప్రచారం

ప్రస్తుతం సినిమా ఎలా తీశామన్నది కాదు.. దాన్ని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లామన్నదే అసలు విషయం అనే సంగతి మన దర్శక నిర్మాతలు బాగా తెలిసొచ్చినట్టు ఉంది.. అందుకే సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే విధానాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. తమన్నా, రాశి ఖన్నాలు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా రచ్చ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

రచ్చ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ సినిమాకే దర్శకుడిగా నియమించబడ్డ సంపత్ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ కసి మీదే బెంగాల్ టైగర్ తీసిన దర్శకుడు సంపత్, సినిమాను ఎలాగైనా ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రసార మాధ్యమాలతో పాటు రవాణా శాఖని కూడా వాడుతున్నారు దర్శక నిర్మాతలు. ఆ దారిలోనే ఇప్పటికే బస్ ల మీద సినిమా పోస్టర్స్ ని అంటిస్తూ ప్రచారం చేస్తుంటే.. ఇప్పుడు అది ట్రైన్లకి కూడా పాకింది.

ట్రైన్లో అయితే ఇంకా ఎక్కువ జనాలు సినిమా గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుందని చిత్ర యూనిట్ ట్రైన్ ప్రచారం స్టార్ట్ చేశారు. సైజ్ జీరోతో మొదలైన ఈ ట్రైన్ ప్రచారం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న బెంగాల్ టైగర్ కూడా చేస్తుంది. వినూత్నంగా ఉన్న ఈ ప్రచారం కిక్-2 అపజయభారాన్ని బెంగాల్ టైగర్ హిట్ తో కడిగేయాలనుకుంటున్న రవితేజకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close