అభద్రత పెంచిన కెసిఆర్‌ ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటలకు రకరకాల అర్థాలు వుంటాయని ఇప్పుడు రాజకీయ వర్గాలు రూఢి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ వారైతే ఎప్పటికప్పుడు అభద్రతతోనే చూస్తున్నారట. ఈ మధ్యనే ఆయన సిటింగ్‌ ఎంఎల్‌ఎలు అందరికీ టికెట్లు ఇస్తానని చెప్పేశారు. అంతకు ముందు కొన్ని మాసాల కిందట తాను నియోజకవర్గాల వారిగా నివేదికలు తెప్పించానంటూ రేటింగ్స్‌ ప్రకటించి కంగారు పెట్టారు. తర్వాత మళ్లీ సర్దుబాటు చేసినా ఆ దెబ్బ పార్టీ నేతలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అందరికీ టికెట్‌ ఇస్తానంటే అస్సలు నమ్మడం లేదు. ఎందుకంటే వాస్తవికంగా అది సాధ్యమయ్యేది కాదు. నిజంగా అలా చేస్తే టిఆర్‌ఎస్‌ నుంచి చాలా మందిని వదులుకోవలసి వుంటుంది. వూరించిన నియోజవర్గాల పెంపు ఎలాగూ లేదు. ఇప్పుడు పాలకపక్షంలో వున్న 90+ ఎంఎల్‌ఎలలో మూడోవంతు మంది బయిటనుంచి వచ్చిన వారే. వారంతా గతంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే ఓడించి వచ్చారు. మరి వీరందరికీ టికెట్టు ఇచ్చేస్తే వారేమయ్యేట్టు? తప్పనిసరిగా మరో పెద్ద పార్టీలో చేరి పోటీ చేస్తారు. ఎందుకంటే ఎలాగోలా నియోజకవర్గాలలో తమ హక్కు కాపాడుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు చేయడానికి వారు సిద్దంగా వుంటారు. ఈ క్రమంలోనే బాగా దెబ్బతిందనుకుంటున్న టిడిపిలోనూ కొందరు ప్రవేశించవచ్చునని, బిజెపి కాంగ్రెస్‌ల నుంచి మరింత మంది పోటీ చేయొచ్చని అనుకుంటున్నారు. కెసిఆర్‌ ప్రకటన తర్వాత ఆ విధమైన ఆలజడి అధికార పార్టీలో పెరగడం తథ్యంగా కనిపిస్తుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు పోటీ దారులు వుండలేరు కదా.. అభద్రత పోగొట్టడానికి కెసిఆర్‌ చేసిన ప్రకటన దాన్ని మరింత పెంచడం ఇక్కడ విచిత్రం. ఇలాటి వారు ఇప్పటికే తమ గ్రూపులకు సంబంధించిన మంత్రులనూ లేదా కెసిఆర్‌ కుటుంబ సభ్యులను కలసి గోడు వెళ్లబోసుకుంటున్నారట

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close