క్రైమ్: ప్రేమ రాయబారి కాలేదని పెట్రోల్ పోసి కాల్చేశాడు..‍! చిన్నారిపై ఇంటర్ విద్యార్థి కిరాతకం..!!

అమ్మాయిల్ని ఓరకంటితో చూడటమే ప్రేమనుకుంటారు. లవ్ లెటర్ ఇవ్వడమే సాహసమనుకుంటారు. సినిమాలు చూసి…తను అనుకునే ప్రేమకు సహకరించని వాళ్ల అంతు చూడటమే హీరోయిజం అనుకుంటారు. లోకం తెలియని వయసుల్లో..స్కూళ్లు, జూనియర్ కాలేజీల స్థాయిలోనే దారి తప్పుతున్న ఇలాంటి వ్యవహారాలు.. అత్యంత క్రూర నేరాలకు దారి తీస్తున్నాయి. తను ఇచ్చిన ప్రేమలేఖను తాను చెప్పిన అమ్మాయికి ఇవ్వలేదని.. ఓ ఏడు తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పింటిశాడు.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

అర్ధవీడులో ఇంటర్‌ చదువుతున్న రంజిత్‌ కుమార్‌ ఏడో తరగతి విద్యార్ధినిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. అదే స్కూల్లో ఏడు తరగతి చదువుతున్న బాలిక స్నేహితుడు రవితేజకు ఓ లవ్‌ లెటర్‌ ఇచ్చి బాలికకు ఇవ్వమన్నాడు. అయితే అందుకు ఆ రవితేజ నిరాకరించడంతో రంజిత్‌కుమార్‌కు కోపం వచ్చింది. తన ప్రేమకు మధ్య వర్తిత్యం వహించేందుకు నిరాకరించిన రవితేజపై దాడి చేసేందుకు నిర్ణయించుకుని పెట్రోల్‌ బాటిల్‌ తీసుకొచ్చాడు. స్కూల్లో భోజన విరామ సమయంలో రవితేజను పక్కకు లాక్కెళ్ళిన రంజిత్‌కుమార్‌ అతనిపై పెట్రోలు పోసి తగుల బెట్టాడు. 90 శాతం కాలిన గాయాలవడంతో..గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ నెల ఏడో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా చిన్నారి మృతి చెందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనసు పూర్తిగా వికసించుకోని మనసుల్లో ఎలాంటి విషబీజాలు నాటుకుపోతున్నాయో ఈ ఘటన వెల్లడిస్తోంది. నేరానికి పాల్పడింది.. నిన్నామొన్న స్కూలు దాటిన విద్యార్థి. చిన్నారుల మనసుల్లో ఇంత దారుణాలకు పాల్పడాలన్న ఆలోచనలు… ఇలాంటి సీన్లను హీరోయిజం లేదా.. విలనిజాన్ని హీరోయిజంగా చూపించే…సినిమాలు, సీరియళ్ల వల్లే వస్తున్నాయనే అభిప్రాయాలు వినిపించడంలో తప్పు లేదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close