నాయని చేసే కేసీఆర్‌ భజనలో సీక్రెట్‌ ఉందా?

నాయని నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో బాగా సీనియర్‌ అయిన మంత్రి. అందరికంటె సీనియర్‌గా నాయనిని కేబినెట్‌ సహచరులందరూ గుర్తిస్తారు. ఆయన హోం శాఖతో పాటు కార్మిక శాఖను కూడా చూస్తున్నారు. తాజాగా మేడే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో నాయని మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. దేశం మొత్తం గర్వించదగిన నేత కేసీఆర్‌ అంటూ.. నాయని విపరీతంగా కేసీర్‌ భజన చేశారు. కేసీఆర్‌ కంటె వయోధికుడు, సీనియర్‌ కూడా అయిన నాయని.. ఈ రేంజిలో కేసీఆర్‌ను కీర్తించడం వెనుక సీక్రెట్‌ ఏమైనా ఉన్నదేమో అని పలువురు జోకులు వేసుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పరిణామాల్లో నాయనిని రాజ్యసభకు పంపుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. తెరాసకు నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఆ కోటాలో నాయని నర్సింహారెడ్డిని రాజ్యసభకు పంపేసి.. కేబినెట్‌లో కొత్తగా వేరేవారికి చోటు కల్పించడానికి కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే రాజ్యసభకు వెళ్లడం నాయనికి ఇష్టం లేదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కేసీఆర్‌ను కీర్తించిన తీరు చూస్తోంటే.. సీఎంను ప్రసన్నం చేసుకోవడం ద్వారా మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఆయన ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ పదవి కంటె ఎవరైనా సరే.. మంత్రిపదవినే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే అది జారిపోకుండా ఉండడానికి ఈ పాట్లు అని నాయకులు జోకులేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close