జీతాల తేదీని పదో తేదీకి మారిస్తే బెటరేమో !

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీన అందలేదు. ప్రభుత్వం వద్ద పైసా లేదు. ఉన్న నిధులన్నింటినీ ఆర్థిక సంవత్సరం ముగింపుసందర్భంగా.. తీవ్ర ఒత్తిడి వచ్చిన బిల్లుల చెల్లింపులకు ఇచ్చేశారు. పంచాయతీల నిధులూ ఇచ్చేశారు. ఇప్పుడు జీతాలివ్వడానికి నిధుల్లేవు. చివరికి వేస్ అండ్ మీన్స్ కింద ఆర్బీఐ ఇచ్చే వెసులుబాటును కూడా దాదాపుగా రూ. రెండు వేల కోట్లను వాడుకున్నారు. ఇప్పుడు జీతాలివ్వాలంటే వచ్చే ఆదాయం నుంచి ఇవ్వాలి.

లేదా అప్పు తేవాలి. ఇప్పటికిప్పుడు రూ. ఐదు వేల కోట్ల ఆదాయం రాదు కాబట్టి.. అప్పులు కూడా ముఖ్యమే. కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం కొత్త అప్పులకు పర్మిషన్ ఇస్తుంది. ఆ ప్రకారం ఆర్బీఐ నుంచి బాండ్లు వేలం వేసి తెచ్చుకోవచ్చు. ప్రతీ నెలా ఇలాగే అవుతోంది. అప్పులతో జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు వస్తాయని ఎదురు చూడటం.. ఆ తర్వాత చాలా కాలం పాటు రాకపోవజం కామన్ అయిపోయింది.

అందుకే ప్రభుత్వం జీతాల తేదీని.. పదో తేదీకి మారిస్తే బెటర్ అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. ఆ తేదీకిజీతాలు ఇస్తే ఉద్యోగులుకూడా తమ ఈఎమ్ఐలను అప్పటికి సర్దుబాటు చేసుకుంటారని అనుకుంటున్నారు. అయితే ఇలా మార్చడానికి అవకాశం ఉందో లేదో స్పష్టత లేదు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక సమస్యలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు.. అందుకే ఇలాంటి ఆలోచనే బెటరని ఉద్యోగులు కూడా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close