ఖమ్మం లో బీజేపీ జనసేన పొత్తు పై బండి సంజయ్ అసహనం?

గత కొంతకాలంగా తెలంగాణ బిజెపి తో తమకు సమన్వయం సరిగాలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. అయితే ఈ పొత్తు పై బండి సంజయ్ అసహనం గా ఉన్నట్లు అంతర్గత సమాచారం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ దూకుడుగా వెళ్తూ ఇతర తెలంగాణ బీజేపీ నేతలను పక్కనపెడుతున్నట్లు ఎప్పటినుండో విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇతర బిజెపి సీనియర్ నేతలను ఆయన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనికితోడు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తర్వాత ఆయన మరింత అహంకరంగా మారిపోయాడని, అందువల్లే తమకు జనసేన తో సహా ఎవరి పొత్తూ అక్కర్లేదన్నట్లు వ్యవహరించాడనే అభిప్రాయం పార్టీలో కూడా వ్యక్తమయింది. ఆయనతోపాటు ఆయనతో సఖ్యంగా ఉండే డీకే అరుణ లాంటి వారు కూడా జనసేన గురించి చులకన వ్యాఖ్యలు చేయడం దీనికి బలం చేకూర్చింది.

అయితే బండి సంజయ్ వ్యవహార శైలి కారణంగా పార్టీకి నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి మాజీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తదితరులు రంగంలోకి దిగినట్లు సమాచారం. తాజాగా బిజెపి జనసేన మధ్య ఖమ్మం ఎన్నికలలో పొత్తు పొడవడానికి కిషన్ రెడ్డి , కే లక్ష్మణ్ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పైగా ఈ చర్చలకు బండి సంజయ్ ని దూరం పెట్టినట్లు సమాచారం. దీంతో ఖమ్మం ఎన్నికల్లో బిజెపి జనసేన మధ్య పొత్తు నిర్ణయం బండి సంజయ్ ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని తెలుస్తోంది. ఈ కారణంగానే బండి సంజయ్ ఖమ్మం ఎన్నికల లో జనసేన తో పొత్తు పై అసహనం గా ఉన్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.

ఏది ఏమైనా తెలంగాణ బిజెపి లో లుకలుకలు కూడా ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. మరి ఖమ్మం ఎన్నికల్లో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close