“దేశం” దృష్టిలో ధొలెరా..! గుజరాత్‌ది వ్యూహమా..? సెల్ఫ్ గోలా..?

గుజరాత్‌లో నిర్మిస్తున్న ధొలెరా నగరం గురించి… ఆంధ్రప్రదేశ్‌లో వివాదం నడుస్తున్న సమయంలోనే… గుజరాత్ ప్రభుత్వం మీడియాలో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చింది. తెలుగు మీడియాతో పాటు ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఈ ప్రకటనలు ఇచ్చాయి. ఆ ప్రకటనలు ధొలెరాను ప్రమోట్ చేయండ అనే కాన్సెప్ట్ కన్నా… వేరే ఉద్దేశంతో సిద్ధం చేసినట్లుగా ఉన్నాయి. కేంద్రం ఎన్ని నిధులిచ్చింది..? దాని పుట్టు పూర్వోత్తరాలేమిటి …? అన్న విషయాలను చెప్పడానికి ప్రాధాన్యమిచ్చింది.

ఈ ప్రకటనలు తెలుగుదేశం నేతలను మరింత ఆగ్రహానికి గురి చేశాయి. కానీ.. దేశం దృష్టికి తమ వాదన తీసుకెళ్లాడనికి ఈ ప్రకటనలను ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలు ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏపీ ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు షార్ప్ గా .. ధొలెరా విషయంలో స్పందించారు. చాలా విషయాలు మీడియాకు వెల్లడించారు. ధొలేరా నగర నిర్మాణంపై తాను , సీఎం మాట్లాడాకే … దేశవ్యాప్తంగా అన్నిభాషల పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. ప్రకటనలకు ఖర్చు చేసినంత డబ్బు కూడా ఏపీ రాజధానికి ఎందుకు నిధులు ఇవ్వలేదన్నారు.. ఢిల్లీ-ముంబై కారిడార్‌లో ధొలేరా భాగమని ప్రభుత్వ పెద్దలే చెప్పారని… వేలకోట్లు నిధులు ఇస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించారని యనమల తేల్చారు. కానీ వైజాగ్-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదన్నారు.

ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా విడిగా ధొలెరాపై స్పందించారు. కేంద్రం ఓ ట్రస్ట్ ద్వారా రూ.17 వేల కోట్లు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఖర్చు చేస్తోందన్నారు. జీవీఎల్ చెప్పినట్లు.. కృష్ణపట్నానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ధొలెరాపై నిజాలు చెబుతామనో.. లేక… ప్రమోట్ చేసుకుందామనో.. లేక నిధులు ఇస్తున్నారు.. ఏం చేసుకుంటారో..చేసుకోమనో.. చెప్పేందుకు… గుజరాత్ ప్రభుత్వం వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేస్తోంది. కానీ ఈ ధొలెరాను చూపించి..అమరావతిపై కేంద్రం చూపిస్తున్న నిరాదరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్దమయింది. అమరావతి- ధొలెరాను పోల్చి.. దేశ ప్రజల ముందుకు … ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టిలో పడేలా చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. దీంతో మరికొద్ది రోజుల పాటు ఈ ధొలేరా మీడియాలో హైలెట్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close