బీసీలను పీకేసి రెడ్లకు పదవులు ఇస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏర్పరచుకున్న మొదటి మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని జగన్ సహా వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేతలు అందరూ చెబుతూ వస్తున్నారు. ప్రత్యేకించి బీసీలకు న్యాయం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ నుండి ప్రకటనలు కూడా వెలువడు తున్నాయి. అయితే ఈ ప్రకటన పై ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఒకవైపు ప్రజలకు చూపించేందుకు బీసీలను మంత్రి పదవుల్లో తీసుకున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికే ఉన్న బీసీలను తొలగించి ఆ పదవులను రెడ్డి వర్గానికి ఇస్తున్నారని కొందరు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

– టిటిడి చైర్మన్ గా ఇప్పటివరకు ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ బీసీ అయితే, ఇప్పుడు సుధాకర్ యాదవ్ స్థానంలో ఆ పదవిని వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు.

– తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ గా ఇప్పటివరకు బిసి వర్గానికి చెందిన నరసింహ యాదవ్ ఉంటే, ఇప్పుడు ఆ పదవి నుంచి ఆయనను తప్పించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి తుడా చైర్మన్ పదవిని అప్పగించారు.

– ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) చైర్మన్ పదవి లో ఇప్పటివరకు కృష్ణయ్య అనే బిసి ఉంటే, ఆ పదవి నుండి ఆయనను తప్పించి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా ను చైర్మన్గా నియమించారు.

మొత్తానికి చూస్తే, మంత్రివర్గ కూర్పు సమయంలో బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి వరకే ఉన్న బీసీలను పీకేసి ఆ స్థానాలను రెడ్ల కి కట్టడంపై అటు బీసీల లోను, ఇటు సామాన్య ప్రజల లోనూ, విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close