“వైఎస్ ఆర్ కుటుంబం” – టైటిలే ఒక పొరపాటా ?

నంద్యాల ఫలితాల అనంతరం వైసిపి పార్టీ క్యాడర్ డీలా పడిన మాట తెలిసిందే. అయితే జగన్ లో మాత్రం ఉత్సాహం ఎంతమాత్రం తగ్గినట్టు లేదు. ఫలితాలొచ్చిన ఆ రెండ్రోజులు కొంచెం డల్ గా కనిపించినా మళ్ళీ ఇప్పుడు యధావిధిగా తన పార్టీ స్కీములని జనాల్లోకి తీసుకెళ్ళే పనిలో పడ్డాడు. ట్విట్టర్ సాక్షిగా జగన్ రాష్ట్రప్రజలకి పిలుపునిచ్చాడు. వైఎస్ ఆర్ కుటుంబం లో భాగస్వాములు కావాలని ప్రజలకి జగన్ పిలుపునిచ్చాడు.

ఇంతకీ ఈ పథకం ఏంటంటే – వైసిపి పార్టీ వాళ్ళు ఇచ్చిన ఒక నంబర్ కి కాల్ చేస్తే ఆ పార్టీ కార్యాలయం వాళ్ళు మాట్లాడుతారు. మన సమస్య ఏంటో చెబితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దాని పరిష్కరిస్తారు. అలాగే కాల్ చేసిన వాళ్ళకి ఆటొమేటిగ్గా పార్టీ సభ్యత్వం వచ్చేస్తుంది. కేవలం సభ్యత్వం మాత్రమే కావాలంటే అదే నంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. తొలిరోజే దాదాపు నాలుగు లక్షల మంది సభ్యులుగా చేరారని వైసిపి వర్గాలు ఆనందగా ఉన్నాయి.

అయితే ఈ స్కీం లోని కొన్ని లోపాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎవరైనా ఫోన్ చేసి సమస్య చెబితే దానికోసం వైసిపి ఏమీ చేయదు. కేవలం దాన్ని నోట్ చేసుకుంటుంది. వైసిపి అధికారం లోకి వచ్చాక మాత్రమే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పథకం వల్ల అధికారం పొందాలనే జగన్ తాపత్రయాన్ని ప్రజలకి మరోసారి గుర్తు చేసినట్టేనంటున్నారు విశ్లేషకులు. ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారం అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త ఒరవడిలో వెళ్తూ ఉద్దానం లాంటి సమస్యలని పరిష్కరిస్తూనో లేదా పరిష్కారానికి ప్రయత్నిస్తూనో ఉంటే జగన్ అన్నిటినీ కేవలం తాను అధికారం లోకి వచ్చాక మాత్రమే పరిష్కరిస్తానని చెప్పడం సరి కాదంటునారు. దాని కంటే ముఖ్యంగా వైఎస్ ఆర్ కుటుంబం అన్న పేరు పెట్టి ప్రతి కార్యకర్తా ఆ కుటుంబ సభ్యుడే అని చెప్పే ఉద్దేశ్యం మంచిదే అయినా, వై ఎస్ ఆర్ కుటుంబం అని టైటిల్ పెట్టి, బ్యానర్లు ఫ్లెక్సీలు అన్నినిటిలో కేవలం రాజశేఖర రెడ్డి,విజయమ్మ, జగన్ ల ఫోటొలు పెట్టడం వల్ల ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన లేక వాళ్ళ కుటుంబానికి మాత్రమే మేలు చేసే స్కీం లాగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి పంపినట్టుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకు, ప్రత్యేకించి ప్రజలకి సంబంధించిన అంశాల్లో ఇలాంటి సెల్ఫ్-సెంట్రిక్ ఆలోచనావిధానం మంచిది కాదని విశ్లేషకుల ఉవాచ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close