ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించే సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ వేశారు. అందులో సింగిల్ షెడ్యూల్లో టాకీ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశార్ట. ఏప్రిల్ రెండో వారంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్, బ్రేక్స్ వంటివి తీసుకోకుండా నాన్-స్టాప్ షెడ్యూల్లో ఫినిష్ చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పకడ్బందీగా చేశారని తెలుస్తోంది. తర్వాత పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్లాలని అనుకుంటున్నార్ట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను తమన్ సంగీత దర్శకుడు. దసరాకు సినిమాను విడుదల చేయాలనేది నిర్మాతల ప్లాన్. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో చేయబోయే మల్టీస్టారర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.