బీజేపీ హామీలు నెరవేర్చలేదని.. వైసీపీకి ఇప్పుడే తెలిసిందా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వకూడదని నిర్ణయించింది. పార్టీ నేతలతో సమావేశమైన జగన్.. ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం.. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమట. నాలుగేళ్లుగా బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలుపుతోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడే ఒక్కసారిగా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఎందుకు గుర్తొచ్చిన్నంది రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది. అసలు బీజేపీ మద్దతు అడగను కూడా అడగలేదు. కానీ వైసీపీ అధినేత జగన్.. అత్యంత రహస్యంగా… ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ తీసుకుని కలసి మరీ .. మరో షరతు లేకుండా మద్దతు ప్రకటించారు.

జగన్ మద్దతు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రకటించింది. తన బద్దశత్రువైన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నా… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ ఎలాంటి షరతులు పెట్టకుండా మద్దతు ఇచ్చింది. అసలు ఎలా మద్దతు ఇస్తుంది..?. మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో ప్రతిపక్షాలు.. అనేక అంశాల్లో పార్లమెంట్ బయట, లోపల ప్రతిపక్షాలు.. అనేక సార్లు ఆందోళనలు చేశాయి. కానీ ఎక్కడా విపక్షాల సమావేశాల్లో వైసీపీ కనిపించలేదు. జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు.. పెట్రోల్, డీజిల్ చార్జీల పెరుగుదలపైనా బీజేపీపై ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం చేయలేదు.

కానీ ఇప్పుడు అనూహ్యంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల కోసం మాత్రం బీజేపీకి మద్దతివ్వకూడదని నిర్ణయించారు. అదే సమయంలో రాజ్యసభ ఎంపీలు మాత్రం.. సభలో ఆందోళన చేయకుండా.. కేవలం.. పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. మొత్తంగా పరిశీలిస్తే… మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడదల్చుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. బీజేపీతో అంటకాగినట్లు.. కనిపించకుండా ఉండాలంటే.. బీజేపీకి వ్యతిరేకంగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. భారతీయ జనతా పార్టీ హామీలను అమలు చేయలేదని ఇప్పటికైగా గుర్తించారు కాబట్టి.. కేంద్రం టార్గెట్‌గా … వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు … ఎటాక్‌ ప్రారంభిస్తారా లేదా అన్న సస్పెన్స్‌గా మారింది. ఇంత వరకూ.. కేంద్రం వైపు నుంచి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా.. ఒక్కటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడైనా బీజేపీ హామీలు అమలు చేయలేదని.. గుర్తించారు కదా..మరి మాట్లాడతారా..? మోడీని విమర్శిస్తారా…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close